M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M. K. Stalin: ఎగ్జిట్ పోల్స్ హడావుడి, అంచనాల హోరు మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. ఓటింగ్ ముగిసిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆయన, అంచనాల కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన కష్టాన్నే నమ్ముకున్నట్లు సంకేతాలిచ్చారు. చెన్నైలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్, కార్మికుడి శ్రమకు తగ్గ వేతనం దక్కడం ఎలాగైతే వాళ్ల హక్కో, అలాగే తమ కూటమి పడ్డ కష్టానికి మే 4వ తేదీన ఫలితాల రూపంలో తగిన ప్రతిఫలం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని, అయితే తాను ఈ మాటలను ఎగ్జిట్ పోల్స్ను చూసి చెప్పడం లేదని, ప్రజల నాడిని, పార్టీ కార్యకర్తల పనితీరును గమనించిన తర్వాతే చెబుతున్నానని స్పష్టం చేశారు. మే డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించిన తన తండ్రి కరుణానిధి వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అందరికీ అన్నీ అందాలనే తమ ప్రభుత్వ ఫిలాసఫీనే మున్ముందు కూడా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా శుభవార్త వింటామని కేడర్లో ఉత్సాహం నింపారు.
మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఊహించని రీతిలో భిన్నంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఒకరిద్దరు విజేతలను చూపిస్తే, ఇక్కడ మాత్రం ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడిఎంకెతో పాటు కొత్తగా రంగంలోకి దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సైతం రేసులో ఉన్నట్లు వేర్వేరు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘యాక్సిస్ మై ఇండియా’ సర్వే ఏకంగా విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో అధికార డీఎంకే 92 నుంచి 110 సీట్లకు పరిమితం కావొచ్చని, ఏఐఏడిఎంకె కేవలం 22 నుంచి 32 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. దీనికి భిన్నంగా ‘పీపుల్స్ పల్స్’ సర్వే మాత్రం డీఎంకేకు స్పష్టమైన మెజారిటీ (125-145 సీట్లు) కట్టబెడుతుండగా, ఏఐఏడిఎంకెను రెండో స్థానంలో, విజయ్ పార్టీని మూడో స్థానంలో నిలబెట్టింది.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
మరోవైపు ‘JVC–టైమ్స్ నౌ’ సర్వే ఏఐఏడిఎంకె ప్రభంజనం సృష్టించబోతోందని, ఆ పార్టీకి 128 నుంచి 147 సీట్లు వస్తాయని బాంబు పేల్చింది. ఇక ‘చాణక్య’ సర్వే ప్రకారం డీఎంకే 125 సీట్లతో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, టీవీకే 63 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని విశ్లేషించింది. ఈ అయోమయ పరిస్థితుల మధ్య రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడూ తమను తక్కువ చేసి చూపుతాయని, తాము కనీసం 150 సీట్లు గెలుస్తామని ఏఐఏడిఎంకె నేత ఇన్బదురై కొట్టిపారేశారు. అటు టీవీకే ప్రతినిధి నిర్మల్ కుమార్ కూడా గ్రౌండ్ రియాలిటీకి, ఈ అంచనాలకు పొంతన లేదని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ.. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలు చాలా జాగ్రత్తగా (తక్కువగా) వేసిన అంచనాలేనని, అసలు ఫలితాల్లో తాము భారీ మెజారిటీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!