Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. తమిళనాడు శాసనసభ సాక్షిగా జోసెఫ్ విజయ్ సంక్షేమ పథకాల వర్షం కురిపించారు. పేద, అల్పాదాయ కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకాన్ని సోమవారం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ. 2.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. 2027 సంక్రాంతి పండుగ నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. పథకం కింద లబ్ధిదారులు సిలిండర్లు కొనుగోలు చేసిన అనంతరం, ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ (డీబీటీ) చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడటం, విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యుడిపై మోయలేని భారంగా మారాయని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం, ఎన్నికల హామీ నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కజగం ఎన్నికల సమయంలో ఏడాదికి 6 ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
కేవలం గ్యాస్ సిలిండర్లే కాకుండా, ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, మహిళల కోసం ఉన్న ‘వెట్రి పయనం’ (వెట్రి పయణ తిట్టం) ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని భారీగా విస్తరించారు. ఇప్పటివరకు కేవలం సాధారణ, కొండ ప్రాంత బస్సుల్లో 40 కిలోమీటర్ల పరిమితితో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇకపై ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్, అంతర్-జిల్లా సర్వీసులకు కూడా వర్తింపజేస్తున్నారు. ఏ మహిళ కూడా రవాణా ఖర్చుల వల్ల అవకాశాలను కోల్పోకూడదన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని విజయ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి ఈ విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
ఇక సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా మారిన చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాజెక్ట్పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతులు, స్థానిక ప్రజల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పరందూర్ లో ఎయిర్పోర్టు నిర్మించే ప్రసక్తే లేదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఖాళీ చేయించకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, దీనికోసం ఇప్పటికే కొన్ని స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దీనికి తోడు ప్రస్తుతం మీనంబాక్కంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోనే సరికొత్తగా ‘టెర్మినల్ 5’ నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..