కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా నటి తమన్నా భాటియాను తీసుకుంది. అయితే, స్థానిక కన్నడ నటీమణులను కాదని ముంబైకి చెందిన తమన్నాను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. ఎం.బి. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ‘బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక ప్రక్రియలో సూపర్ స్టార్ రజనీకాంత్ సభ్యుడిగా ఉన్న ఒక…