Talasani Srinivas : బడుగుబలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత కేసీఆర్దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ బీఅర్ఎస్ ఇంఛార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ, సమ్మేళన కార్యక్రమంలో మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంకా గులాబీ పార్టీ ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుంటే.. గోశామహల్ అభివృద్ధిలో వెనకబడిందన్నారు. గోశామహల్లో బీజేపీ గెలిచి ఇన్ని సంవత్సరాలైనా ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రం గోశామహల్ ను గాలికి వదిలేశారని ఆయన దుయ్యబట్టారు.
Also Ready : Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
అంతేకాకుండా.. ‘గోశామహల్లో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ముసలమ్మ నుండి పుట్టిన పసిపిల్లల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అనుగుణంగా పథకాలు ప్రవేశ పెట్టారు. గోశామహల్ లో గెలిచిన రాజాసింగ్ 9సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల సంక్షేమం గాలికి వదిలి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బేగంబజార్ లో ఎంతో మంది సంతోషంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ ప్రతిష్టంగా పనిచేస్తున్నది కాబట్టి శాంతిపూర్వకంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. గోశామహల్ లో నార్తిండియన్స్ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ను బలపర్చాలని కోరుతున్నాం.
Also Read : WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్
గోశామహల్ లో తమ ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాము చేపట్టాము అది మీకు తెలుసు.. గోశామహల్ నియోజకవర్గంలో ఎలాంటి వారైనా కడుతున్న బిల్డింగ్లపై డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఉరుకొము. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించి గోశామహల్ లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి కోరుతున్నాము. అమిత్ షా కు కులలాలను, మతాలను విడగొట్టడం వారి ఎజెండా.
గోశామహల్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వచ్చిన గెలిపించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. తెలంగాణ లో ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం పనిచేస్తుంది. మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తాం. నా సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎలా చూసుకున్నానో.. గోశామహల్ ను అలానే చూసుకుంటా.’ అని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!