WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్
లండన్ వేదికగా ఆస్ట్రేలియతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు.
Also Read : అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన 10 అగ్నిపర్వతాలు
Also Read
దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ కు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ ను సెలక్టర్లు పిలుపినిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్ తో పాటు అదనపు పేసర్ గా శార్థూల్ ఉండనున్నాడు.
Also Read : Horror: అప్పుడు ‘రాజుగారి గది’… ఇప్పుడు ‘రాణిగారి గది…’!
అదే విధంగా ప్లేయింగ్ ఎల్ వన్ లో కూడా శార్థూల్ చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే శార్థూల్ ఠాకూర్ కు ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంలో ఓ ఫోర్ వికెట్ హాల్ తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది. ఒక ఓవరాల్ గా భారత తరపున 8 టెస్టు మ్యాచ్ లు ఆడిన శార్థూల్.. 27వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ ను తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ.. రహానే వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
తాజావార్తలు
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!