Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Talks With Pakistan Are The Only Way To End Terrorism In Jammu And Kashmir

Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్‌తో చర్చలే ఏకైక మార్గం

NTV Telugu Twitter
Published Date :June 12, 2024 , 9:54 pm
By RAMAKRISHNA KENCHE
  • జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
  • అమాయకులు చనిపోతున్నారని ఆవేదన
  • చొరవ తీసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి సూచన
Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్‌తో చర్చలే ఏకైక మార్గం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్‌ అబ్దుల్లా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. “రెండు దేశాల (భారత్‌-పాకిస్థాన్‌) మధ్య అవగాహన ఉంటే తప్ప ఉగ్రవాదం అంతం కాదు. ఉగ్రవాదం కొనసాగుతుందని, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బాధాకరమైన విషయం ఏమిటంటే.. అమాయకులు చనిపోతున్నారు… అది దురదృష్టకరం.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..

మనం మేల్కొని దీనికి పరిష్కారం కనుగొనే వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సరిహద్దు సమస్యల పరిష్కారంపై భారత్ దృష్టి సారిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “సంభాషణ” మాత్రమే ముందున్న మార్గమన్నారు. మనం చైనాతో మాట్లాడాలని నిన్న విదేశాంగ మంత్రి స్వయంగా చెప్పారన్నారు. మొదటిసారి పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించారని తెలిపారు . ఆయన దీనిని ఇలాగే కొనసాగించి పరిష్కారం కనుగొనాలని కోరారు.

READ MORE: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ

కాగా.. వరస ఎన్‌కౌంటర్లతో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. రియాసీ బస్సుపై దాడి తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీకి భక్తులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • External Affairs Minister S Jaishankar
  • Farooq Abdullah
  • Jammu and Kashmir
  • Pakistan
  • terrorism

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: మీరు విజయోత్సవాలు ఎందుకు జరపలేకపోతున్నారు.. సజ్జల ప్రశ్న..!

  • MLA Raja Singh: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..

  • IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ..

  • Thug Life : కమల్ థగ్ లైఫ్ ప్రీ రివ్యూ

  • Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

ట్రెండింగ్‌

  • Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions