Tadipatri: జేసీ vs కాకర్ల.. గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు, కాకర్ల రంగనాథ్ అనుచరులు పరస్పరం ఎదురెదురయ్యారు. మొదట నినాదాలతో ప్రారంభమైన వాగ్వాదం, తరువాత రాళ్ల దాడిగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందిన సమాచారం ప్రకారం, ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గానికి చెందిన వినాయక విగ్రహం నిదానంగా వెళ్తుండటంతో జేసీ ప్రభాకర్రెడ్డి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై ఆగ్రహించిన రంగనాథ్, ప్రభాకర్రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని రాళ్ల దాడులు జరిగాయి. ఈ దాడిలో రంగనాథ్ వర్గానికి చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం.
Komatireddy Venkat Reddy : సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
Also Read
ఈ సందర్బంగా ఉధృతరూపం దాల్చిన ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో శోభాయాత్రను తిరిగి కొనసాగించారు. ఘర్షణకు కారణంగా ప్రాంతంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఎన్నికల ముందు కాకర్ల రంగనాథ్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఎన్నికల అనంతరం జేసీ ప్రభాకర్రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజా ఘర్షణ ఆ విభేదాలనే ప్రతిబింబించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Man Kills Wives: బిహార్లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!