NTV Telugu Site icon

Swati Maliwal case: బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Kure

Kure

ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది. అతడి జ్యుడీషియల్ కస్టడీ జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీస్ హజారీ కోర్టు ఎదుట బిభవ్ కుమార్‌ను పోలీసులు హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..

మే 13వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మే 16వ తేదీన బిభవ్ కుమార్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత మే 18న బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపీ స్వాతి మలివాల్‌కు వచ్చిన బెదిరింపులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ క్రమంలో బిభవ్ కుమార్ బెయిల్ దరఖాస్తును తీస్ హజారీ కోర్టు కొట్టి వేసింది. ఇక సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి గురించి ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖలు రాశారు. ఈ సందర్బంగా సొంత పార్టీలోని నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని వారికి వివరించింది.

ఇది కూడా చదవండి: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..

తాను రుతుక్రమంలో ఉన్నానని చెప్పినా.. అత్యంత దారుణంగా బిభవ్ కుమార్ దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్వాతి మాలివాల్ పేర్కొన్నారు. సున్నితమైన అవయవాలపై దాడి చేసినట్లు వాపోయింది. అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగిందని.. ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Tragic Video: విషాదం.. స్విమ్మింగ్ చేసిన క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయిన బాలుడు..