Suspecting Affair: అక్రమ సంబంధం ఉందని అనుమానం.. భార్యను గొంతుకోసి హత్య, ఆపై ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం..
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
వివరాల్లోకి వెళ్తే.. భర్తతో కొన్ని రోజులుగా దూరంగా తన తల్లిదండ్రలతో కలిసి ఉంటుంది. కాగా.. మే 21వ తేదీన మహిళ అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. విచారణలో భాగంగా అసలు నిజం బయటపడింది. తన భార్యను హత్య చేసినట్లు భర్త అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
Read Also: Foreign Portfolio Investors : 20 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన విదేశీ ఇన్వెస్టర్లు
ఈ క్రమంలో.. మే 21న నిందితుడు తన భార్యకు ఫోన్ చేసి కరోండ్ క్రాసింగ్ వద్దకు రావాలని కోరాడు. దీంతో.. అతని దగ్గరికి వచ్చిన భార్య ఫోన్ ను తన వద్దనుంచి లాక్కున్నాడు. అందులో ఒక వీడియో చూసి కోపంతో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత నిందితుడు తన ఆటోలో మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ పాతిపెట్టిన చెత్త డంప్ వద్ద కిరోసిన్ పోసి తగలబెట్టాడని పోలీసులు తెలిపారు. కాగా..కాలిపోయిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం పంపినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య), ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!