Foreign Portfolio Investors : 20 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన విదేశీ ఇన్వెస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Portfolio Investors : 2004 నుంచి 2019 వరకు నాలుగు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ మే నెలలో ముగిశాయి. ఆ తర్వాత మే నెలలోనే ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కానీ 2024 లోక్సభ ఎన్నికలు వేరు. ఈ ఎన్నికలను చరిత్రలోనే సుదీర్ఘమైన ఎన్నికలుగా పేర్కొంటున్నారు. ఇది మే అంతటా కొనసాగి జూన్ 1న ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సమాంతరంగా మరొకటి కూడా జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కనిపించింది.
ఎన్నికల సంవత్సరం మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా తమ డబ్బును ఉపసంహరించుకున్నారు. ఇది చివరిసారిగా 2004 సంవత్సరంలో కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. విశేషమేమిటంటే విదేశీ ఇన్వెస్టర్లు రూ.25,500 కోట్లకు పైగా డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఎన్నికల సంవత్సరాల్లో మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారు.. ఉపసంహరించుకున్నారో తెలుసుకుందాం.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
Read Also:Telangana Rains: నేడు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు..
మే నెలలో రూ.25,500 కోట్లు వెనక్కి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, చైనా మార్కెట్ల మెరుగైన పనితీరు కారణంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐలు) మే నెలలో భారతీయ స్టాక్ల నుండి రూ.25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు. మారిషస్తో భారతదేశం పన్ను ఒప్పందంలో మార్పులు, అమెరికా బాండ్ ఈల్డ్లలో నిరంతర పెరుగుదలపై ఆందోళనల కారణంగా.. ఏప్రిల్లో రూ. 8,700 కోట్ల కంటే ఎక్కువ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఎఫ్పిఐలు మార్చిలో రూ. 35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. జనవరిలో వారి షేర్ల నుంచి రూ.25,743 కోట్లు ఉపసంహరించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో భారతీయ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల దిశను నిర్ణయిస్తుంది.
20 ఏళ్ల రికార్డు బద్దలు
ఎన్నికల సంవత్సరం 2024 మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు చేసిన ఉపసంహరణ ఇరవై ఏళ్ల రికార్డు బద్దలైంది. 2004 తర్వాత తొలిసారిగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కనిపించింది. 2004 సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు రూ. 3248 ఉపసంహరించుకున్నారు. ఆ ఏడాది అధికారంలో మార్పు వచ్చింది. ఆ తర్వాత 2009 సంవత్సరంలో మే నెలలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు రూ.20,116 కోట్లు పెట్టుబడి పెట్టారు. అప్పట్లో అధికారంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 2014 మే నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.14,007 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత అధికార మార్పిడితో దేశంలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం రాబోతుందన్న వాతావరణం ఏర్పడింది. దీని కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. 2009 సంవత్సరంలో మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు సాధారణంగా రూ.7920 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే అధికారం మారే అవకాశం లేదని వారికి నమ్మకం ఏర్పడింది.
Read Also:Exit Poll 2024: ఎగ్జిట్ పోల్ పై ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?
బాండ్, డెట్ మార్కెట్ల చరిత్ర ఏమిటి?
మే నెలలో ఎఫ్పిఐ రూ. 8,761 కోట్లను డెట్ లేదా బాండ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టింది. అంతకుముందు విదేశీ ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్లో మార్చిలో రూ.13,602 కోట్లు, ఫిబ్రవరిలో రూ.22,419 కోట్లు, జనవరిలో రూ.19,836 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఐదు నెలల్లో కేవలం ఏప్రిల్ నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు రూ.10,949 కోట్ల నగదును వెనక్కి తీసుకున్నారు. ఓవరాల్ గా చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో ఇప్పటి వరకు రూ.53,669 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు ఈ సెగ్మెంట్ నుండి 301 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. కాగా 2009 సంవత్సరంలో రూ.2707 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2014 సంవత్సరం పూర్తిగా విరుద్ధంగా కనిపించింది. విదేశీ పెట్టుబడిదారులు బాండ్ మార్కెట్లో 19,771 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. మరోవైపు, మే 2019లో డెట్ మార్కెట్లో పెట్టుబడి మొత్తం నామమాత్రంగా రూ.1187 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!