IPL 2024: ముంబై ఇండియన్స్ టీమ్కు హార్ట్ బ్రేక్ న్యూస్.. స్కై పోస్ట్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ టీమ్ కు గుండె పగిలే వార్త వచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రాం స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను కలవర పెట్టాడు. ఇక, పరోక్షంగా తాను ఈసారి ఐపీఎల్ ఆడలేనన్న సంకేతాలను స్కై ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, స్కై పోస్ట్ పెట్టిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇదే నిజమైనట్లు సమాచారం. అయితే, గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న సూర్య జనవరిలో సర్జరీలు చేయించుకుని ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక, స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ( NOC ) ఇవ్వాల్సి ఉంది.. కానీ, తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. అందుకే స్కై సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించినట్లు సమాచారం.
Read Also: Marriage scheme: పెళ్లి కానుకల కోసం కక్కుర్తి! ఓ వివాహిత ఏం చేసిందంటే..!
Also Read
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
- India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
కాగా, ఇటీవలే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లకు ఎన్ఓసీ ఇచ్చిన ఎన్సీఏ.. స్కై విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో స్కై పోస్ట్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న సూర్యకుమార్ చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలను చేయించుకున్నాడు. సూర్య తాజా పోస్ట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.
Read Also: Jayamailini: సిల్క్ స్మిత చేసిన తప్పు.. ఆమెను బలిచేసింది..
ఒకవేళ ఎన్సీఏ సూర్యకుమార్ యాదవ్ కు ఎన్ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా.. లేకపోతే తొలి దశ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కేతో ఆర్సీబీ తలపడబోతుంది. ఇక, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ఆడబోతుంది.
Suryakumar Yadav's Instagram story. pic.twitter.com/2M7ZGBhTDN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
తాజావార్తలు
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!