Suryakumar Yadav: కోహ్లీ రికార్డుకు చెక్.. సూర్య భాయ్ నయా హిస్టరీ..
Suryakumar Yadav: ముంబై వానఖేడే స్టేడియంలో జరిగిన ఈ భారత్-అమెరికా మ్యాచ్ ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో నిలిచిపోతుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్లో అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించింది. స్కోర్బోర్డ్ చూసినప్పుడు ఇది సాధారణ గెలుపులా అనిపించొచ్చు. కానీ మ్యాచ్ అంత ఈజీగా సాగలేదు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భుజాలపై వేసుకుని గెలిపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదట్లోనే ఇబ్బందుల్లో పడింది. వరుసగా వికెట్లు పడటంతో స్కోరు నెమ్మదిగా సాగింది. ఒక దశలో పెద్ద స్కోరు అసాధ్యమే అనిపించింది. అప్పుడు క్రీజ్లో నిలబడ్డాడు కెప్టెన్ సూర్యకుమార్. మొదట జాగ్రత్తగా ఆడుతూ, తర్వాత తన స్టైల్లో షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. నాలుగో వైపు బాల్ వెళ్తే బౌలర్లు అయోమయంలో పడిపోయారు. అతని బ్యాట్ నుంచి 10 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. 49 బంతుల్లోనే నాటౌట్గా 84 పరుగులు చేశాడు. చివరకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యం నిలిచింది.
READ MORE: Suryakumar Yadav: శభాష్ సూర్యకుమార్! కెప్టెన్గా తొలి ప్రపంచకప్ ఇన్నింగ్స్లోనే అరుదైన ఘనత..
Also Read
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
లక్ష్యం పెద్దదిగా అనిపించకపోయినా, భారత బౌలర్లు మ్యాచ్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. బౌలర్ అర్షదీప్ సింగ్ మరోసారి మెరిశాడు. అతను రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి ఆశలను తగ్గించాడు. ఈ మ్యాచ్తో టీ20 వరల్డ్ కప్లో అర్షదీప్ వికెట్ల సంఖ్య 29కి చేరింది. ఎట్టకేలకు అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక అసలు హీరో సూర్యకుమార్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో సూర్యకుమార్ మరో రికార్డు తన పేరుపై రాసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ల్లో భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. కోహ్లీ 16 సార్లు ఈ అవార్డు గెలిచాడు. సూర్య ఇప్పుడు కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. రోహిత్ శర్మ 14 సార్లు, అక్షర్ పటేల్ 8 సార్లు ఈ అవార్డు గెలిచారు.
READ MORE: Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం
వరల్డ్ కప్ విషయానికి వస్తే సూర్యకుమార్ మరో ప్రత్యేక ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్లో అతను నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ ఇంకా ముందున్నాడు. కోహ్లీ 35 మ్యాచ్లు ఆడి 8 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. సూర్య 19 మ్యాచ్ల్లో 4 సార్లు గెలిచాడు. యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ ముగ్గురూ వరల్డ్ కప్లో 3 సార్లు చొప్పున ఈ అవార్డు పొందారు. ఇప్పుడు సూర్య వాళ్లందరినీ దాటేశాడు. ఈ గెలుపుతో భారత జట్టు మరో గొప్ప రికార్డు కూడా సృష్టించింది. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 మ్యాచ్లు గెలిచి టాప్లో ఉండేవి. భారత్ ఇప్పుడు వాళ్లను కూడా దాటిపోయింది. గతంలో భారత్ 2012 నుంచి 2014 మధ్య 7 వరుస విజయాలు మాత్రమే సాధించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!