Suryakumar Yadav: ఫియర్ లెస్ బ్యాటింగ్.. రో-కో ను అధిగమించి T20లో కెప్టెన్ సూర్య నయా హిస్టరీ
- T20లో కెప్టెన్ సూర్య నయా హిస్టరీ
- సూర్య తన 3,000వ T20I పరుగును కూడా పూర్తి చేసుకున్నాడు
- UAE బ్యాట్స్మన్ మహ్మద్ వసీం పేరిట ఉన్న రికార్డును సూర్య బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు ఐదవ, చివరి మ్యాచ్ లో తలపడుతున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇది సూర్య తన T20 అంతర్జాతీయ కెరీర్లో 24వ హాఫ్ సెంచరీ. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో టిమ్ సీఫెర్ట్ స్టంప్ అవుట్ చేశాడు.
Also Read:IND vs NZ 5th T20: ఇషాన్ ఊచకోత.. కివీస్ టార్గెట్ ఎంతంటే?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ తన 3,000వ T20I పరుగును కూడా పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా, సూర్య 3,000 T20I పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాట్స్మన్. 1,822 బంతుల్లో 3,000 పరుగులు సాధించాడు. 3,000 పరుగులు చేరుకోవడానికి 1,947 బంతులు తీసుకున్న UAE బ్యాట్స్మన్ మహ్మద్ వసీం పేరిట ఉన్న రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. జోస్ బట్లర్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు ఈ విషయంలో సూర్య కంటే చాలా వెనుకబడి ఉన్నారు.
T20Iలో అత్యంత వేగంగా 3000 పరుగులు (బంతుల వారీగా)
1822 సూర్యకుమార్ యాదవ్ (భారతదేశం)
1947 మహ్మద్ వసీం (యుఎఇ)
2068 జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
2077 ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
2113 డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2149 రోహిత్ శర్మ (భారతదేశం)
2169 విరాట్ కోహ్లీ (భారతదేశం)
ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మూడో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్కు రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ విషయంలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అగ్రస్థానాన్ని పంచుకున్నారు. 2017 ఢిల్లీ టీ20లో న్యూజిలాండ్పై రోహిత్, ధావన్ 158 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!