Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2022 జూలై 10న ఇంగ్లాండ్పై ఆడిన ఒక అద్భుతమైన, సుడిగాలి ఇన్నింగ్స్ను ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా గుర్తుచేసుకుంది. నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (11), రిషభ్ పంత్ (1) కేవలం 31 పరుగులకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. అలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతను శ్రేయస్ అయ్యర్తో కలిసి నాలుగో వికెట్కు 119 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్లో ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ 23 బంతుల్లో 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 212.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 117 పరుగులు చేసి సంచలన శతకాన్ని నమోదు చేశాడు. సూర్య తన ఇన్నింగ్స్లో 19 సింగిల్స్, 3 డబుల్స్, 14 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి
Mumbai Indians (@mumbaiindians) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
అయితే, ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ భారత్ను గెలిపించడానికి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి అవతలి వైపు నుండి ఇతర ఆటగాళ్లెవరూ సరైన మద్దతు ఇవ్వలేదు. దినేష్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7), హర్షల్ పటేల్ (5) వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. చివరకు మోయిన్ అలీ బౌలింగ్లో సూర్యకుమార్ అవుట్ కావడంతో భారత పోరాటం ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్య అసాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, భారత్ 17 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల ముందే సూర్య తన క్లాస్ చూపించిన ఈ ఇన్నింగ్స్ను “ప్రతి యాంగిల్ నుండి కడక్” అంటూ ముంబై ఇండియన్స్ కొనియాడింది. దీనిపై నెటిజన్లు సూర్య కుమార్ యాదవ్ ను మిస్ అవుతున్నామని.. వుయ్ మిస్ సూర్య భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!