Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2022 జూలై 10న ఇంగ్లాండ్పై ఆడిన ఒక అద్భుతమైన, సుడిగాలి ఇన్నింగ్స్ను ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా గుర్తుచేసుకుంది. నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (11), రిషభ్ పంత్ (1) కేవలం 31 పరుగులకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. అలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతను శ్రేయస్ అయ్యర్తో కలిసి నాలుగో వికెట్కు 119 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్లో ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ 23 బంతుల్లో 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 212.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 117 పరుగులు చేసి సంచలన శతకాన్ని నమోదు చేశాడు. సూర్య తన ఇన్నింగ్స్లో 19 సింగిల్స్, 3 డబుల్స్, 14 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.
Also Read
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి
Mumbai Indians (@mumbaiindians) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
అయితే, ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ భారత్ను గెలిపించడానికి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి అవతలి వైపు నుండి ఇతర ఆటగాళ్లెవరూ సరైన మద్దతు ఇవ్వలేదు. దినేష్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7), హర్షల్ పటేల్ (5) వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. చివరకు మోయిన్ అలీ బౌలింగ్లో సూర్యకుమార్ అవుట్ కావడంతో భారత పోరాటం ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్య అసాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, భారత్ 17 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల ముందే సూర్య తన క్లాస్ చూపించిన ఈ ఇన్నింగ్స్ను “ప్రతి యాంగిల్ నుండి కడక్” అంటూ ముంబై ఇండియన్స్ కొనియాడింది. దీనిపై నెటిజన్లు సూర్య కుమార్ యాదవ్ ను మిస్ అవుతున్నామని.. వుయ్ మిస్ సూర్య భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!