Surya Kumar Yadav: ఇది కదా కెప్టెన్సీ అర్థం! నా నిజమైన ట్రోఫీలు.. నా జట్టు సహచరులే అంటూ..
- "నా నిజమైన ట్రోఫీలు నా జట్టు సహచరులే"
- ఆసియా కప్ 2025 గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం.
- మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీకి విరాళంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya Kumar Yadav: దుబాయ్లో ఆసియా కప్ 2025 ను భారత్ కైవసం చేసుకుంది. ఇక టోర్నీని గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించిన సంఘటనపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జట్టు మొత్తం టోర్నమెంట్లో కష్టపడి విజయం సాధించిందని, అయితే ట్రోఫీని అందుకోలేకపోవడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. అలాగే నాకు తెలిసి ఇలా చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. మేము కష్టపడి ఈ విజయాన్ని సాధించాం. టోర్నమెంట్లో వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచామని సూర్యకుమార్ పేర్కొన్నారు.
Sohani Kumari: నటి కాబోయే భర్త ఆత్మహత్య.. తప్పు చేశానంటూ సెల్ఫీ వీడియో
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రోఫీని తిరస్కరించిన విషయంపై పాకిస్థాన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సూర్యకుమార్ చాలా కూల్ గా, భావోద్వేగంతో సమాధానమిచ్చారు. ట్రోఫీ గురించి మీరు అడిగితే.. దానికి, నా అసలైన ట్రోఫీలు నా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి. నా 14 మంది సహచరులు, సహాయక సిబ్బందే నా రియల్ ట్రోఫీలు అంటూ భావోద్వేగంతో సంభాషించారు. నేను ఈ టోర్నమెంట్ నుండి గుర్తుంచుకునే అసలైన క్షణాలు అవే.. విజయం సాధించిన తర్వాత, ఛాంపియన్లే గుర్తుంటారు, ట్రోఫీ ఫోటో కాదని సూర్యకుమార్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అంతేకాకుండా, తాము ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకూడదని ఎవరి నుండి ఆదేశాలు రాలేదని, అది తామే మైదానంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే రికార్డు కొల్లగొట్టిన సాయి అభ్యంకర్
అంతేకాకుండా.. సూర్యకుమార్ యాదవ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఆసియా కప్లో తనకు లభించిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై ఆయనకు సోషల్ మీడియాలో పెద్దెత్తున ప్రశంసలు వస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమ సోషల్ మీడియాలో ట్రోఫీని ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.
When the game is done, only the champions will be remembered and not the picture of a 🏆 pic.twitter.com/0MbnoYABE3
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!