Supreme Court : విడాకులు తీసుకున్నా ఇచ్చిన కట్నం ఇవ్వని అత్తామామలు..కోర్టుకెక్కిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court : కుటుంబ వివాదానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ, స్త్రీధనం అనేది స్త్రీ ఏకైక ఆస్తి అని, ఆమె అనుమతి లేకుండా ఆమె అత్తమామల నుండి స్త్రీ ధనం రికవరీని ఆమె తండ్రి క్లెయిమ్ చేయరాదని పేర్కొంది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉద్దేశ్యం తప్పు చేసిన వారిని శిక్షించడమేనని.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కాదని పేర్కొంది. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు అనే వ్యక్తి తన కుమార్తె మాజీ అత్తమామలు పెళ్లి సమయంలో ఇచ్చిన స్త్రీధనాన్ని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈ కేసును కోర్టులో దాఖలు చేశారు.
స్త్రీధనం అనేది స్త్రీకి ఆమె తల్లిదండ్రులు, బంధువులు లేదా అత్తమామలు ఇచ్చే డబ్బు, ఆస్తితో సహా బహుమతులను సూచించడానికి ఉపయోగించే పదం. స్త్రీకి (భార్య లేదా మాజీ భార్య) స్త్రీధనం పై పూర్తి హక్కు ఉంటుందని చట్టం పునరుద్ఘాటించింది. విడాకులు తీసుకున్న మహిళ తండ్రి తన కుమార్తె మాజీ అత్తమామలపై దాఖలు చేసిన క్రిమినల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా పేర్కొంది, “క్రిమినల్ ప్రొసీడింగ్ల లక్ష్యం కోర్టును ఆశ్రయించిన వారి వ్యక్తికి న్యాయం చేయడమేనని.. ఫిర్యాదుదారుకు శత్రుత్వం ఉన్న వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడం కాదని చెప్పింది.
Also Read
Read Also:Varalakshmi Vratham: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. వారికి అన్నీ ఉచితం..
పడాల వీరభద్రరావు 1999లో పెళ్లి సమయంలో బంగారు ఆభరణాలు, అనేక వస్తువులు బహుమతులుగా ఇచ్చారని ఆయన తరఫు వాదనలు వినిపించారు. తర్వాత కూతురు తన భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత తన కూతురు, అల్లుడు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని పడాల వీరభద్రరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ 2015 ఆగస్టు 14న అమెరికాలో విడాకులు తీసుకున్నారు. 2021 సంవత్సరంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో, పడాల వీరభద్రరావు తన కుమార్తెకు నగలు బహుమతిగా ఇచ్చాడని, పెళ్లి సమయంలో ఈ వస్తువులన్నింటినీ ఆమె అత్తమామలకు అప్పగించాడని, కానీ ఇప్పుడు అవి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. 2018లో అతని కూతురు రెండో పెళ్లి చేసుకుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. మహిళ విడాకులు తీసుకున్న 5 సంవత్సరాలకు పైగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
భార్య ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు లేదని జస్టిస్ కరోల్ అన్నారు. కుమార్తె సజీవంగా, ఆరోగ్యంగా ఉండి, స్త్రీధనం కోరుకునే నిర్ణయాలు తీసుకునే పూర్తి సామర్థ్యం కలిగి ఉంటే, తండ్రికి స్త్రీధనం పై హక్కు ఉండదు. పడాల వీరభద్రరావు కుమార్తె మాజీ అత్తమామలపై విచారణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకున్నప్పటికీ, అన్ని వైవాహిక సమస్యలను పరిష్కరించినప్పటికీ, అత్తమామలు ‘స్త్రీధనం’ని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ తండ్రి జనవరి 2021లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
Read Also:Hydra Demolitions: రామ్ నగర్ లో హైడ్రా అక్రమ కూల్చి వేతలు
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!