Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. రేపే సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించనుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం..
READ MORE: Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకంకు ముహూర్తం ఖరారు!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇరువైపులా వాదనలు గతంలోనే ముగిసాయి.. సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ సింగ్వి వాదన వినిపించారు.. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింగ్వి కోర్టుకు తెలుపగా, స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యూడిషియల్ సమీక్ష చేయొచ్చని స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.. అంతేకాదు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదంటూ వాదనలు వినిపించారు.. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? నాలుగేళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా..? అంటూ జస్టిస్ బీఆర్ గవాయి గత విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు..
READ MORE: AP Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి! కరస్పాండెంట్పై పోక్సో కేసు
మరోపక్క అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు బీఆర్ఎస్ తరపు న్యాయవాది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.. గతంలోనూ సుప్రీంకోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కామెంట్ చేశారని.. సీఎం సమయమనం పాటించాలి అంటూ జస్టిస్ బి.ఆర్.గవాయి సీరియస్ అయ్యారు.. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!