Supreme Court: “పీరియడ్ లీవ్” పిటిషన్ను విచారించడానికి నిరాకరించిన సుప్రీం..
- మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్
- పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం
- ఈ విషయంలో మోడల్ పాలసీని నిర్ణయించడానికి వాటాదారులు.. రాష్ట్రాలతో చర్చలు జరపాలని కేంద్రానికి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీరియడ్ లీవ్ మంజూరు కోసం ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ పిటిషన్ దాఖలైంది. దానిని పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ విషయంలో మోడల్ పాలసీని నిర్ణయించడానికి అన్ని వాటాదారులు మరియు రాష్ట్రాలతో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పీరియడ్ లీవ్కు సంబంధించి, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. “ముఖ్యంగా మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం పడొచ్చు. నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మహిళల ప్రయోజనాల కోసం తాము చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.” అని పేర్కొన్నారు. ఈ అంశం ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, దీనిని కోర్టు చూడకూడదని అన్నారు.
READ MORE: Terrorists Attack: కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరికి గాయాలు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని సెక్రటరీ, ఏఎస్జీ ఐశ్వర్య భాటి ముందు తన అభిప్రాయాలను తెలియజేయడానికి పిటిషనర్ను అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో పాటు.. ఈ అంశాన్ని విధాన స్థాయిలో పరిశీలించి, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత, ఈ విషయంలో ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించవచ్చో లేదో నిర్ణయించాలని కోర్టు కార్యదర్శిని అభ్యర్థించింది. వాస్తవానికి పీరియడ్ లీవ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా సెలవులకు సంబంధించిన నిబంధనలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి సుప్రీంకోర్టును కోరారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అమలు చేయాలని పిటిషన్లో ఆదేశాలు ఇచ్చారు. దీని కింద బాలికలకు, మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టంలోని నిబంధనలను అమలు చేసేందుకు ఇన్స్పెక్టర్ల నియామకాన్ని కూడా నిర్ధారించాలని పిటిషనర్ పిల్లో పేర్కొన్నారు. 1992 నాటి పాలసీ ప్రకారం.. ప్రస్తుతం ప్రత్యేక రుతు నొప్పి సెలవులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం బీహార్ అని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!