BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహారాల్లో పాల్గొనకుండా మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు నేడు (ఫిబ్రవరి 5) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు 2017 జనవరి ఆదేశాలను సవరించి ఇకపై నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఠాకూర్ బీసీసీఐ (BCCI) కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
2017 జనవరిలో సుప్రీంకోర్టు అనురాగ్ ఠాకూర్ను బీసీసీఐ వ్యవహారాలకు దూరంగా ఉండాలని (“cease and desist”) ఆదేశించింది. అప్పుడు ఐసీసీ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్కు లేఖ రాసిన విషయంపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు అవమాన (Contempt), అబద్ధ ప్రమాణం (Perjury) కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఠాకూర్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరై క్షమాపణ తెలిపారు. దీంతో 2017 జూలై 14న సుప్రీంకోర్టు ఆయనపై కేసులను రద్దు చేసింది.
IP66, IP68, IP69 రేటింగ్స్, 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో Oppo Reno 15c అమ్మకాలు షురూ!
ఇప్పుడు ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్య బాగ్చి ధర్మాసనం “డాక్టరీని అఫ్ ప్రోపోర్టివ్నాలిటీ” (Doctrine of Proportionality) సూత్రాన్ని వర్తింపజేసి పాత ఆదేశాలను సవరించింది. ఠాకూర్ క్షమాపణ చెప్పిన విషయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది.