YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణ వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది.
Read Also: Anil Kumar Yadav: సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ఇక, ఈ వ్యవహారంలో వచ్చేవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీతారెడ్డి.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చింది.. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, జులై 1న మళ్లీ బెయిల్ పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సుప్రీంను ఆశ్రయించారు సునీతారెడ్డి.. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తన పిటిషన్లో సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు సునీతారెడ్డి. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే.. హైదరాబాద్ నాంపల్లిలోని లోని సీబీఐ కోర్టులో లొంగిపోగా ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, అంతకుముందు తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు 5వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించింది.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో 2019 మార్చి 28న పోలీసులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!