Supreme Court: విచారణ టైంలో మొబైల్-ల్యాప్టాప్ను జప్తు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు సంస్థల ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు అభివర్ణించింది. విచారణ సమయంలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రమాదకరం మాత్రమే కాదు, ఇది వ్యక్తుల గోప్యతను కూడా ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also:Anantapur: అనంతపురంలో దారుణం.. మ్తెనర్ బాలిక హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లపై విచారణ జరుపుతోంది. వీటిలో ఒక పిటిషన్ను ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో డిజిటల్ పరికరాల జప్తుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఈ అంశం చాలా ముఖ్యమైనదని ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడు, ఎందుకు స్వాధీనం చేసుకుంటాయనే దానిపై మార్గదర్శకాలు లేవు. కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. పదేపదే నేరాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు ముఖ్యమైన డేటాను దొంగిలించగలరని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి కొంత సమయం కావాలన్నారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్కు వాయిదా వేసింది.
Read Also:Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
-
CM NTR: సీఎం ఎన్టీఆర్.. దద్దరిల్లిన థియేటర్
-
Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!