Supreme Court: విచారణ టైంలో మొబైల్-ల్యాప్టాప్ను జప్తు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు సంస్థల ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు అభివర్ణించింది. విచారణ సమయంలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రమాదకరం మాత్రమే కాదు, ఇది వ్యక్తుల గోప్యతను కూడా ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also:Anantapur: అనంతపురంలో దారుణం.. మ్తెనర్ బాలిక హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లపై విచారణ జరుపుతోంది. వీటిలో ఒక పిటిషన్ను ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో డిజిటల్ పరికరాల జప్తుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఈ అంశం చాలా ముఖ్యమైనదని ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడు, ఎందుకు స్వాధీనం చేసుకుంటాయనే దానిపై మార్గదర్శకాలు లేవు. కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. పదేపదే నేరాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు ముఖ్యమైన డేటాను దొంగిలించగలరని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి కొంత సమయం కావాలన్నారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్కు వాయిదా వేసింది.
Read Also:Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?