Supreme Court Questions EC: బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. నెక్ట్స్ హియరింగ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Questions EC: సుప్రీంకోర్టు గురువారం బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను, వారి తొలగింపునకు గల కారణాలతో ఈనెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
READ MORE: No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
తదుపరి విచారణ ఆగస్టు 22న..
సుప్రీంకోర్టు విచారణలో ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. “ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయి. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదు. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు” అని పేర్కొంది. ఈసీ వాదనలు విన్న అనంతరం.. అన్ని బూత్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదికను తీసుకొని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను స్థానిక వార్తాపత్రికలు, దూరదర్శన్, రేడియో లేదా ఏదైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. బూత్ వారీగా 65 లక్షల మంది జాబితాను ప్రదర్శించండి అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్, పంచాయతీ కార్యాలయాల్లో బూత్ల వారీగా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న రానుంది.
READ MORE: Minister Anitha: రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!