Supreme Court Questions EC: బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. నెక్ట్స్ హియరింగ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Questions EC: సుప్రీంకోర్టు గురువారం బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను, వారి తొలగింపునకు గల కారణాలతో ఈనెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
READ MORE: No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
తదుపరి విచారణ ఆగస్టు 22న..
సుప్రీంకోర్టు విచారణలో ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. “ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయి. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. వివాదాస్పదం కాని నిర్ణయమంటూ ఏదీ లేదు. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు” అని పేర్కొంది. ఈసీ వాదనలు విన్న అనంతరం.. అన్ని బూత్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదికను తీసుకొని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను స్థానిక వార్తాపత్రికలు, దూరదర్శన్, రేడియో లేదా ఏదైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. బూత్ వారీగా 65 లక్షల మంది జాబితాను ప్రదర్శించండి అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్, పంచాయతీ కార్యాలయాల్లో బూత్ల వారీగా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న రానుంది.
READ MORE: Minister Anitha: రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..