Sthree Nidhi App: పేదలకు 48 గంటల్లో రుణాల మంజూరు.. స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Streenidhi VOA App: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రణాళికలు రూపొందించాం అని తెలిపారు. గత ఆరు నెలలుగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) చేసిన కృషి ఫలితమే ఈ యాప్ అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
స్త్రీనిధికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చేయబడిందని తెలిపారు. గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాల్ని 12 నెలల నుండి 36 నెలల వరకు EMIల రూపంలో చెల్లించవచ్చు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రుణానికి 11% వడ్డీ మాత్రమే ఉండటం మరో ప్రధాన సౌలభ్యం. ఇకపై రుణ చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, యాప్ ద్వారానే చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంకులు సర్వర్ సమస్యలు రాకుండా చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, స్త్రీనిధి యాప్ భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!