Sthree Nidhi App: పేదలకు 48 గంటల్లో రుణాల మంజూరు.. స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Streenidhi VOA App: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రణాళికలు రూపొందించాం అని తెలిపారు. గత ఆరు నెలలుగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) చేసిన కృషి ఫలితమే ఈ యాప్ అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!
Also Read
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
స్త్రీనిధికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చేయబడిందని తెలిపారు. గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాల్ని 12 నెలల నుండి 36 నెలల వరకు EMIల రూపంలో చెల్లించవచ్చు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రుణానికి 11% వడ్డీ మాత్రమే ఉండటం మరో ప్రధాన సౌలభ్యం. ఇకపై రుణ చెల్లింపుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, యాప్ ద్వారానే చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంకులు సర్వర్ సమస్యలు రాకుండా చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, స్త్రీనిధి యాప్ భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!