Stock Markets: రికార్డు స్థాయికి చేరుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు సెన్సెక్స్ 69,381.31 పాయింట్ల వద్ద.. నిఫ్టీ రికార్డు స్థాయిలో 20,864.05 పాయింట్ల వద్ద ముగిశాయి.
Vishnu Vishal : వరదల్లో చిక్కుకున్న తమిళ హీరో.. సాయం చేసిన రెస్క్యూ టీం..
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
కాగా.. బ్యాంక్ నిఫ్టీ 1.52 శాతం పెరిగింది. పీఎస్యూ బ్యాంక్ కూడా 1.63 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.45 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ, మీడియా, రియల్టీ నష్టాల్లో ఉన్నాయి. తొలిసారిగా.. సెన్సెక్స్ 69000 దాటింది. నిఫ్టీ కూడా ఈ రోజు ట్రేడింగ్ను కొత్త ఆల్ టైమ్ హై లెవెల్ 20808తో ప్రారంభించింది. ఈరోజు సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 69168 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ దాని మునుపటి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 68918.22 ను అధిగమించి కొత్త రికార్డును సృష్టించింది. NSE బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 కూడా చరిత్ర సృష్టించి 20702కి చేరుకుంది. దీంతో ఈరోజు రికార్డులు కొల్లగొట్టాయి.
Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..
ఇదిలా ఉంటే.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ ఇప్పటికీ నిఫ్టీ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 5 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.2658.90కి చేరింది. అదానీ పోర్ట్స్లో దాదాపు 4 శాతం పెరుగుదల ఉంది. ఇప్పుడు రూ.913.40కి చేరింది. ఇవే కాకుండా నిఫ్టీ టాప్ గెయినర్ల జాబితాలో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉన్నాయి.
- Tags
- Business
- Highs
- HIT
- new record
- Nifty
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!