Stock Market: స్టాక్ మార్కెట్ పతనం.. రెండు నిమిషాల్లో రూ.2.14 లక్షల కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు. స్టాక్ మార్కెట్ పతనానికి కారణం విదేశీ మార్కెట్లు క్షీణించడం ప్రధాన కారణం. మరోవైపు ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇందుకు ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. సెన్సెక్స్ 67000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో సెన్సెక్స్ 70వేలు, నిఫ్టీ 21 వేల పాయింట్ల అవరోధాన్ని బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్లోని రెండు ప్రధాన సూచీలలో భారీ క్షీణత ఉంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మార్కెట్ ప్రారంభమైన రెండు నిమిషాలకే 750 పాయింట్లు క్షీణించి 66,822.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 595.21 పాయింట్ల పతనంతో 66,976.69 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 50లో కూడా భారీ క్షీణత నెలకొంది. డేటా ప్రకారం.. నిఫ్టీ 152 పాయింట్ల క్షీణతతో 19,826.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే ఈరోజు నిఫ్టీ కూడా 19,887.40 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కోలుకుంటే ఈ స్థాయి 20 పాయింట్లు దాటే అవకాశం ఉంది.
Also Read
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
Read Also:Parliament Session: మణిపూర్ అంశంపై విపక్షాల పట్టు.. ఉభయ సభలు వాయిదా
ఐటీ కంపెనీల్లో భారీ క్షీణత
ఐటీ కంపెనీల క్షీణత స్టాక్ మార్కెట్ క్షీణతకు అతిపెద్ద కారణంగా పరిగణించబడుతుంది. ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 8 శాతం క్షీణించి నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతున్నాయి. హెచ్సిఎల్ షేర్లలో దాదాపు 3 శాతం క్షీణత ఉంది. విప్రో షేర్లు దాదాపు రెండు శాతం పడిపోయాయి. టీసీఎస్ షేరు 1.65 శాతం క్షీణతతో ట్రేడవుతోంది. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కూడా 1.62 శాతం తగ్గింది.
రెండు నిమిషాల్లో 2.14 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రెండు నిమిషాల్లోనే రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. పెట్టుబడిదారుల లాభనష్టాలు BSE మార్కెట్ క్యాప్తో ముడిపడి ఉంటాయి. ఒకరోజు క్రితం బీఎస్ఈ ముగిసే సరికి మార్కెట్ క్యాప్ రూ.3,04,04,787.17 కోట్లుగా ఉంది. మరోవైపు, ఈరోజు ఉదయం 9.17 గంటలకు బిఎస్ఇ 66,822.15 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, మార్కెట్ క్యాప్ రూ.3,01,90,520.52 కోట్లకు దిగజారింది. అంటే మార్కెట్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు రూ.2,14,266.65 కోట్లు నష్టపోయారు. 10 గంటల సమయానికి BSE మార్కెట్ క్యాప్ 3,03,39,951.78 కోట్లకు చేరుకుంది.
Read Also:Yadadri MMTS: ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు.. గుట్ట వద్ద ప్రత్యేక ట్రాక్
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!