Atrocious: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం.. జార్ఖండ్లో ఘటన
జార్ఖండ్లోని దుమ్కాలో స్పానిష్ మహిళా టూరిస్ట్పై సామూహిక అత్యాచారం ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఛత్తీస్గఢ్కు చెందినదిగా గుర్తించారు. పాలములోని విశ్రంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఆమే స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం కోసమని జార్ఖండ్కు వెళ్లింది. కాగా.. బాధితురాలి సహోద్యోగులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో.. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం బాధితురాలు జార్ఖండ్లోని విశ్రాంపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్టేజ్ షోలో పాల్గొనడానికి తన సహచరులతో కలిసి చత్తీస్గఢ్ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆర్కెస్ట్రాలో పనిచేసేదని గుర్తించారు. కొన్ని కారణాల వల్ల అక్కడ కార్యక్రమం నిర్వహించలేక పోవడంతో.. ఆ అమ్మాయి తన స్నేహితులతో కలిసి అదే కారులో మరో కార్యక్రమానికి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా.. బాధితురాలికి మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని తెలిపారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఆ తర్వాత.. బాధితురాలిపై తోటి కళాకారులు ముగ్గురు కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన తరువాత.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి పోలీసులు గాలిస్తున్నారు. .
మరోవైపు.. ఈ ఘటన దురదృష్టకరమని బీజేపీ ఎంపీ గీతా కోరా తెలిపారు. అంతేకాకుండా.. అటు సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!