Sri Lanka: చైనాకు షాక్.. భారత్తో బలమైన సంబంధాల కోసం శ్రీలంక ప్రయత్నాలు!
- ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరిన శ్రీలంక
- భారత్తో బలమైన సంబంధాల కోసం శ్రీలంక ప్రయత్నాలు
- భారత్కు మరింత దగ్గరైన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకేకు పార్లమెంటులో మెజారిటీ లభించింది. ఇది ఆయన ఆర్థిక సంస్కరణల ఎజెండాను బలోపేతం చేసింది. భారతదేశంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, భారత హైకమిషనర్ సంతోష్ ఝాతో దిసానాయకే సమావేశమయ్యారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఈ చర్యకు చైనా ఖచ్చితంగా షాక్ అయ్యింది. ఎందుకంటే చైనా చూపు నిరంతరం శ్రీలంకపైనే ఉంటుంది. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడు భారత్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.
దిసానాయకే పార్టీ ఎన్పీపీ విజయం
శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 159 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దిసానాయకే పార్టీ ఎన్పీపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో 62 శాతం ఓట్లు దిసానాయకే పార్టీకి వచ్చాయి. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస పార్టీకి 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత, భారత హైకమిషనర్ సంతోష్ ఝా ట్విటర్లో ఒక పోస్ట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
Also Read
Read Also: AI chatbot : హోమ్వర్క్ కోసం అడిగితే.. బూతులు తిట్టిన ఏఐ.. ఏకంగా చనిపోమని సలహా!
భారత్కు మరింత దగ్గరైన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
కొలంబోలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంగా భారత్ శ్రీలంక అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రెసిడెంట్ కావడానికి ముందు నుంచి దిసానాయకే భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భారత హైకమిషనర్ క్రమం తప్పకుండా దిసానాయకే, ఆయన బృందాన్ని కలుస్తున్నారు.శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ మద్దతు చాలా ముఖ్యం. పర్యాటకం నుండి బ్యాంకింగ్ రంగం వరకు, భారత్ సహాయం శ్రీలంకకు చాలా అవసరం. 2022 నుంచి భారత ఆర్థిక సహాయం శ్రీలంకకు ప్రాణదాత. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళుల ప్రాబల్యం ఉన్న జాఫ్నా జిల్లాలో దిసానాయకే పార్టీ అత్యధిక ఓట్లను సాధించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!