Sri Lanka: చైనాకు షాక్.. భారత్తో బలమైన సంబంధాల కోసం శ్రీలంక ప్రయత్నాలు!
- ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరిన శ్రీలంక
- భారత్తో బలమైన సంబంధాల కోసం శ్రీలంక ప్రయత్నాలు
- భారత్కు మరింత దగ్గరైన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకేకు పార్లమెంటులో మెజారిటీ లభించింది. ఇది ఆయన ఆర్థిక సంస్కరణల ఎజెండాను బలోపేతం చేసింది. భారతదేశంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, భారత హైకమిషనర్ సంతోష్ ఝాతో దిసానాయకే సమావేశమయ్యారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఈ చర్యకు చైనా ఖచ్చితంగా షాక్ అయ్యింది. ఎందుకంటే చైనా చూపు నిరంతరం శ్రీలంకపైనే ఉంటుంది. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడు భారత్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.
దిసానాయకే పార్టీ ఎన్పీపీ విజయం
శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 159 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దిసానాయకే పార్టీ ఎన్పీపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో 62 శాతం ఓట్లు దిసానాయకే పార్టీకి వచ్చాయి. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస పార్టీకి 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత, భారత హైకమిషనర్ సంతోష్ ఝా ట్విటర్లో ఒక పోస్ట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Read Also: AI chatbot : హోమ్వర్క్ కోసం అడిగితే.. బూతులు తిట్టిన ఏఐ.. ఏకంగా చనిపోమని సలహా!
భారత్కు మరింత దగ్గరైన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
కొలంబోలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంగా భారత్ శ్రీలంక అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రెసిడెంట్ కావడానికి ముందు నుంచి దిసానాయకే భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భారత హైకమిషనర్ క్రమం తప్పకుండా దిసానాయకే, ఆయన బృందాన్ని కలుస్తున్నారు.శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ మద్దతు చాలా ముఖ్యం. పర్యాటకం నుండి బ్యాంకింగ్ రంగం వరకు, భారత్ సహాయం శ్రీలంకకు చాలా అవసరం. 2022 నుంచి భారత ఆర్థిక సహాయం శ్రీలంకకు ప్రాణదాత. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళుల ప్రాబల్యం ఉన్న జాఫ్నా జిల్లాలో దిసానాయకే పార్టీ అత్యధిక ఓట్లను సాధించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!