AP New CS Srilakshmi: ఏపీ కొత్త సీఎస్ ఆమెనా ?.. జగన్ తనకు ఫేవర్ గా ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New CS Srilakshmi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త సీఎస్ పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన పదవీకాలం పొడగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్ రేసులో పలువురి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అందరికంటే ముందు వరుసలో శ్రీలక్ష్మీ ఐఏఎస్ పేరు ఉంది. జగన్ కూడా ఆమె పనితీరు పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆమె కంటే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్న 1987 బ్యాచ్కి చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్తో పాటు 1988 బ్యాచ్కి చెందిన పూనం మాలకొండయ్య, గిరిధర్ పేర్లు కూడా రేసులో వినిపిస్తోన్నాయి. కానీ శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Read Also: Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
1988బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ క్యాడర్కు వెళ్లేందుకు ఆమె దరఖాస్తు చేసుకోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ఓఎంసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో.. ఆమెను సీఎస్గా నియమించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఏపీ క్యాడర్కు మారిన తర్వాత జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గాలి జనార్థన్ రెడ్డికి అనుకూలంలగా శ్రీలక్ష్మి వ్యవవహరించారనే అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి చంచల్గూడ జైల్లో ఏడాది ఉన్నారు. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత సీబీఐ అభియోగాలను తప్పబడుతూ ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఇటీవల సీబీఐ ఆమెపై నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
- Tags
- ap
- CS
- ias
- srilakshmi
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!