Spices Price: ఘాటెక్కిన మసాలా.. నెలలో 42% ఎగిసిన పసుపు.. 3రెట్లు పెరిగిన జీలకర్ర రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spices Price: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ధరల భారాన్ని మోస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశం నుంచి దిగిరావడం లేదు. పండ్లు ముట్టుకుందామన్నా ధరల షాక్ తగులుతుంది. ఇంతలోనే మసాలల ధరల ఘాటు నషాళానికి ఎక్కుతుంది. వాటి ధర అనేక రెట్లు పెరిగింది. దీంతో సామాన్యుల కిచెన్ బడ్జెట్ తలకిందులైపోయింది. విశేషమేమిటంటే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర అత్యంత ఖరీదైనది. దీని ధర అనేక రెట్లు పెరిగింది. దీంతో పప్పు దినుసుల్లో జీలకర్ర మాయమైపోయింది. రానున్న రోజుల్లో మసాలా దినుసులు మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు, దుకాణదారులు చెబుతున్నారు.
అయితే జీలకర్రతో పాటు మెంతులు, ఎండు యాలకులు, కారం, పసుపు, కొత్తిమీర కూడా చాలా ఖరీదయ్యాయి. కొన్ని నెలల క్రితం వరకు మార్కెట్లో జీలకర్ర కిలో రూ.200 ఉండేది. ఇప్పుడు దాని ధర కిలో రూ.700 దాటింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో కిలో జీలకర్ర ధర రూ.700 నుంచి రూ.720కి పెరిగింది. రానున్న రోజుల్లో జీలకర్ర ధర మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చిన తర్వాతే ధరలు తగ్గుతాయంటున్నారు.
Also Read
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Read Also:Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
13ఏళ్ల గరిష్టానికి పసుపు ధర
అదేవిధంగా పసుపు కూడా చాలా ఖరీదైనదిగా మారింది. దీని ధర 13 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. విశేషమేమిటంటే.. నెల రోజుల్లోనే పసుపు ధరలో 42 శాతం పెరుగుదల నమోదైంది. దాని ధర మూడు నెలల్లో 76 శాతం పెరిగింది. మహారాష్ట్రలోని హింగోలిలోని కురుంద మార్కెట్లో పసుపు క్వింటాల్కు రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. అయితే దీని ధర కొన్ని నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.10 వేల లోపే ఉండేది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో పసుపు ధర రూ.150 వరకు ఉంది. కాగా, గతంలో కిలో రూ.70 నుంచి 80 వరకు విక్రయించేవారు.
రూ.100పెరిగిన యాలకుల ధర
ఎర్ర మిరపకాయలు రిటైల్ మార్కెట్లో చాలా ఖరీదైనవిగా మారాయి. దీని ధర కూడా దాదాపు రెట్టింపైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో కిలో రూ.150కి లభించే ఎర్రమిర్చి ఇప్పుడు కిలో రూ.280కి అమ్ముడుపోతోంది. అదేవిధంగా అజ్వైన్, మెంతికూర, లవంగం, యాలకులు కూడా ఖరీదైనవిగా మారాయి. కిలో రూ.150 ఉన్న ఆకుకూరల ధర రూ.220కి పెరిగింది. పెసరపప్పు ధర కూడా రూ.20 పెరిగింది. ఇప్పుడు కిలో రూ.120కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా లవంగం ధర కూడా కిలో రూ.900కి పెరిగింది. పెద్ద ఏలకులు కిలోకు 1200 రూపాయలకు విక్రయించబడుతోంది, అంతకుముందు రూ.1000కే లభించేవి.
Read Also:India And Japan: ఇండో-పసిఫిక్లో యథాతథ స్థితే కొనసాగింపు: జపాన్
సుగంధ ద్రవ్యాలు ధర (6 నెలల క్రితం) ప్రస్తుత ధర (కేజీలో)
జీలకర్ర 365 725
పసుపు 120 180
సోపు 250 500
ఏలకులు 1000 1300
రెడ్ చిల్లీ 150 280
పెద్ద ఏలకులు 1000 1200
తాజావార్తలు
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి