Emergency Landing: స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. దీంతో చెన్నై విమానాశ్రయం అత్యవసర ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది.
Fake Babas Gang: దుండిగల్లో దొంగ బాబాల ముఠా.. మత్తుమందు చల్లి రూ. 8.5 లక్షలు స్వాహా..!
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ఇక ఈ విషయమై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, స్పైస్జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నాలుగు రోజుల క్రితమే.. పాట్నా వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం (ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన వెంటనే) సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీకి మళ్లింది. అంతకుముందు ఆగస్టులో కూడా శ్రీనగర్లో స్పైస్జెట్ విమానం ఇలాంటి సాంకేతిక సమస్యతోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Shyamala: ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’.. కొత్త సినిమా విడుదలైంది అంటూ శ్యామల సెటైర్లు..
వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలపై స్పైస్జెట్ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశీయంగా ఈ విమానయాన సంస్థ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!