NTV Telugu Site icon

Gurugram: మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి పై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి

Gurugram

Gurugram

అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్‌లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ప్రమాదం జరిగే ముందు సరోజ్ అనే మహిళా పారిశుధ్య కార్మికురాలు రోడ్డు ఊడుస్తోంది. బాధిత మహిళ తన పని తాను చేసుకుంటుండగా.. వెనుక నుండి దూసుకువచ్చే కారును మహిళ గమనించలేకపోయింది. దీంతో.. కారును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో మహిళను ఢీకొట్టాడు. బాధితురాలు అక్కడే ప్రాణాలు విడిచింది.

Read Also: Thug Life : కమల్ ‘థగ్ లైఫ్’ షూట్ లో ప్రమాదం..ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.

చుట్టు పక్కన ఉన్న స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి.. వెంటనే మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ మహిళ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. స్థానికులు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..

మరోవైపు.. పారిశుద్ధ్య కార్మికురాలి మరణవార్త తెలియగానే తోటి పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి పనిచేయకుండ రోడ్లను దిగ్బంధించారు. పారిశుద్ధ్య కార్మికురాలి మృతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. అయితే.. పోలీసులు వారికి సమగ్ర విచారణ జరిపి నిందితుడిని పట్టుకుంటామని నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న మృతురాలి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.