Ram Navami: అయోధ్యలో శ్రీ రామనవమి వేడుకలకు అంతా సిద్ధం.. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన ప్రసాదాన్ని ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.
రాంలల్లా జన్మదినోత్సవంలో భక్తులకు పంచిపెట్టే ప్రసాదం కొత్తిమీర పంజిరీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది భోగ్ తర్వాత శ్రీరాముడికి మాత్రమే నైవేధ్యంగా పెడుతారు. అయితే.. రాంలల్లా జన్మదినోత్సవం పురస్కరించుకుని 10 క్వింటాళ్లకు పైగా పంజిరీని తయారు చేస్తున్నారు. దీంతో పాటు.. పెద్ద మొత్తంలో లడ్డూలు, పేలాలు కూడా పంపిణీ చేయనున్నారు. పంజీరితో పాటు.. పంచమేవ, రామదాన మొదలైనవి ప్రసాదంగా భక్తులకు ఇవ్వనున్నారు. మొత్తం ప్రసాదం కలిపి 40 క్వింటాళ్ల వరకు సిద్ధం చేస్తున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
కాగా.. రాంలల్లాకు నైవేధ్యంగా చప్పన్ భోగ్ అందించనున్నారు. మరోవైపు భక్తులకు పంచామృతాన్ని ప్రసాదంగా ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సమయాన రామజన్మ వేడుకల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. రామజన్మోత్సవాన్ని అత్యంత ఘనంగా, ఉత్సాహంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాంలల్లా జన్మదినోత్సవం వేడుకలు పురస్కరించుకుని.. కొన్ని రోజుల నుంచి సాయంత్రం వేళల్లో సోహార్, భజన తదితర ప్రదర్శనలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు రాంలల్లా దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, ట్రస్ట్ సంయుక్తంగా సన్నాహాలు చేశాయి. ఏడు లేన్ల నుంచి దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. క్యూలో ఉన్న భక్తులకు నీరు, ప్రసాదం అందించేందుకు కృషి చేస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు.. సేవా ఆతిథ్యం అందించేందుకు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకొచ్చారు. నగరంలో 20కి పైగా చోట్ల తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరం గుండా వెళ్లే భక్తులకు నీరు తాగాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శిబిరాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!