Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్లు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వే యార్డులో అత్యాధునిక సాంకేతిక మార్పులు, ట్రాక్ల పునరుద్ధరణ , మౌలిక సదుపాయాల మెరుగుదల పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రైళ్ల రాకపోకల్లో వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. అయితే.. ఈ పనుల నిర్వహణ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఈ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణించే ముఖ్యమైన ఎక్స్ప్రెస్లు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా.. శాతవాహన ఎక్స్ప్రెస్.. మే 2 నుంచి 5 వరకు రద్దు చేయబడింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ & గౌతమి ఎక్స్ప్రెస్.. ఈ రద్దీ రైళ్లు కూడా నిర్ణీత కాలంలో అందుబాటులో ఉండవు. ఇంటర్సిటీ సర్వీసులు.. గుంటూరు–సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా రద్దు అయ్యింది. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ , డోర్నకల్ మార్గాల్లో నడిచే ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం–మహబూబ్నగర్, కాకినాడ–లింగంపల్లి మార్గాల్లో ప్రయాణించే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
Also Read:Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.
వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. రైల్వే శాఖ ఈ కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను పైన పేర్కొన్న తేదీలకు అనుగుణంగా మార్చుకోవాలి. రైలు బయలుదేరే ముందు ఎన్టిఇఎస్ (NTES) యాప్ లేదా రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా లైవ్ స్టేటస్ను సరిచూసుకోవాలి.
రద్దయిన రైళ్లకు బదులుగా అందుబాటులో ఉన్న ఇతర రైళ్లు లేదా రోడ్డు రవాణా మార్గాలను పరిశీలించాలని అధికారులు కోరారు. రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించే క్రమంలో ఈ తాత్కాలిక ఇబ్బందులు తప్పవని.. ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలో రైళ్ల వేగం పెరగడమే కాకుండా.. సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!