sonam wangchuk: “మాకు మంత్రి పదవులపై ఆశ లేదు”.. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
sonam wangchuk: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా నేడు ఒక వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ‘కాక్రోజ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనామ్ వాంగ్చుక్ పాల్గొని, యువతను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, నాలాంటి వారు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటి ఉంటారని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు విద్యాశాఖ మంత్రి అవ్వాలనో లేదా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు, కోరికలు లేవని స్పష్టం చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ అనేది కేవలం అధికారంలోకి రావడానికి ఉపయోగపడే రాజకీయ వేదిక కాదని, ఇది ప్రజలలో చైతన్యం తెచ్చే ఒక పవిత్రమైన ప్రయత్నమని పేర్కొన్నారు. యువతను మేల్కొల్పడమే లక్ష్యంగా సాగుతున్న ఒక స్వచ్ఛమైన ఉద్యమమని ఆయన అభివర్ణించారు. దేశంలో నిరంతరం వేధిస్తున్న పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి సమస్యలకు ఇకనైనా ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు మంత్రి అయినా, చివరకు ప్రధానమంత్రి అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా, విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది రాబోయే తరాల భవిష్యత్తు కోసం బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు.
విద్యా వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ముఖ్యమని సోనామ్ వాంగ్చుక్ నొక్కి చెప్పారు. రాబోయే తరాలకు చదువు ఎంత అవసరమో.. వారు శ్వాసించడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. కేబీఆర్ (KBR) పార్క్ పరిరక్షణ కోసం ఇక్కడి ప్రజలు చేసిన ప్రచార కార్యక్రమాలు, భూమిని, నదులను కాపాడుకోవడానికి వారు నిలబడిన తీరును ఆయన అభినందించారు. ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ.. అడవులను నరికివేసి కాంక్రీట్ భవనాలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రజలు సంతోషిస్తారనే తప్పుడు నమ్మకంలో పాలకులు ఉన్నారని, ఈ కాంక్రీట్ జంగిల్స్ మన పిల్లల భవిష్యత్తును కాపాడలేవని హితవు పలికారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. మన అడవులను, నదులను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గొంతు విప్పినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. దీర్ఘకాలంలో మన విద్యను, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే.. స్వల్పకాలంలో మనకు ముందుగా ఒక క్రియాశీలకమైన, నిజాయితీగా పనిచేసే ప్రజాస్వామ్యం కావాలని సోనామ్ వాంగ్చుక్ ఆకాంక్షించారు.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!