Rajasthan : వీడు కొడుకా ఛీ..ఛీ.. తల్లిని 80సార్లు పొడిచి చంపాడు
Rajasthan : రాజస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచి కంటికి రెప్పలా కాపాడుకునే కన్న తల్లిని హతమార్చాడు. 80 సార్లకు పైనే కత్తితో పొడిచి తల్లిరుణం ఇలా తీర్చుకున్నాడు. ఆమె చేసిన నేరమల్లా తన తమ్ముడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లుతాననడమే. ససేమీరా ఆ పెళ్లికి వెళ్లవద్దంటూ కొడుకు తల్లిని దారుణంగా వారించి అంతమొందించాడు. ఈ ఘటన రాజస్తాన్లోని బిల్వారా జిల్లా పుర్ పట్టణంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితుడైన ఆ యువకుడిని శుక్రవారం పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లారు.
Read Also: Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
పుర్ ఎస్హెచ్వో పురన్మల్ మీనా ప్రకారం, ఈ ఘటన గురువారం సాయంత్రమే చోటుచేసుకుంది. బిష్నోయి మొహల్లాలోని శంకర్ లాల్ ఇంటిలో జరిగింది. శంకర్ లాల్ మార్కెట్కు వెళ్లాడు. భార్య మంజు స్థానికంగా ఉంటున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి బ్యాగ్ సర్దుతోంది. అదే సమయంలో ఆమె కొడుకు సునీల్ లోపలికి వచ్చాడు. ఎటు వెళ్లుతున్నావని తల్లిని ప్రశ్నించాడు. తన తమ్ముడి ఇంట్లో జరుగుతున్నా పెళ్లికి వెళ్తున్నానని చెప్పింది.
Read Also: Sri Hanuman Stotra Parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో భోగభాగ్యాలే
అంతే, వెళ్లొద్దని కొడుకు వారించడు. నా సొంత తమ్ముడు తాను కచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని తల్లి సమాధానం చెప్పింది. ఈ రకంగా వారి మధ్య మాటలు పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది. కోపంలో సునీల్ కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చాడు. తల్లిని పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత సునీల్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు శుక్రవారం సునీల్ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లినట్టు వివరించాడు. శంకర్ ఒక రైతు. సునీల్ కంప్యూటర్ కోర్సు చదివాడు కానీ, నిరుద్యోగిగానే ఉన్నాడు. మరణించిన మంజు సోదరుడు వినోద్ పోలీసు స్టేషన్కు వెళ్లి చెల్లి మరణంపై ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదైంది.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!