Viral: ఉద్యోగం చేయడం ద్వారా డబ్బు ఆదా చేయడం నేటి కాలంలో పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా నెలకు రూ.30- రూ.40 వేల రూపాయల వరకు జీతం తీసుకుంటున్న వారికి ఇదో పెద్ద సమస్యే. నెలనెలా జీతం రాగానే మొదటి 10-15 రోజుల్లో ఎక్కడ ఖర్చు పెడతారో తెలియదు. వాటిలో ప్రధానంగా తెలిసినవి రెండే ఖర్చులు అందులో మొదటి ఇంటి అద్దె, రెండోది ఈఎంఐ బిల్లులు. 60-70 వేల రూపాయల జీతం కూడా ప్రజలకు సరిపోని నగరాలు చాలా ఉన్నాయి. అటువంటి ఖరీదైన నగరం బెంగళూరు. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. 25-30 వేల జీతం ఉన్నవారు అక్కడ నివసించలేరు. బెంగళూరులో నివసిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
Read Also:Skanda Release Date: సలార్ ఎఫెక్ట్.. వెనక్కి స్కంద! రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు పృధ్వీ రెడ్డి. అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ఒక పోస్ట్ను పంచుకున్నాడు. అందులో అతను బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్ళిన అనుభవం గురించి చెప్పాడు. హైదరాబాద్కు మారిన తర్వాత ప్రతినెలా రూ.40 వేలు ఆదా అవుతోందని పేర్కొన్నారు. ఇంత డబ్బుతో తన కుటుంబం హాయిగా గడుపుతుందని అంటున్నారు. పృధ్వీ చేసిన ఈ పోస్ట్ జనాల దృష్టిని ఆకర్షించింది. ఇది ట్విట్టర్లో వైరల్గా మారుతోంది.
Moved from Bangalore to #Hyderabad
Saved 40k per month expenses.
One family can live peacefully with that money. 💰
Not seeing any a point of living alone when my values match with my family’s.
— Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023
Read Also:Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
పృధ్వీ పోస్ట్ను ఇప్పటివరకు 20 వేలకు పైగా వీక్షించారు. వందలాది మంది ప్రజలు కూడా లైక్ చేశారు. దీనిపై భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పృధ్వీ అభిప్రాయాలతో కొందరు ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తే, మరికొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఒంటరిగా ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం వృధా చేసుకుంటారు. నేను నా ఇంట్లో ఉన్నప్పుడు, నా పని గురించి తప్ప మరేమీ ఆలోచించను అని రాసుకొచ్చారు. మరొకరు ‘మీరు నా ఆలోచనలను దొంగిలించారు. బ్రదర్ మీరు చెప్పింది పూర్తిగా నిజం’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ కామెంట్లో, ‘మీ అద్దె నెలకు 40 వేల రూపాయలా?’ అని అడిగారు, దానికి ప్రతిస్పందనగా పృధ్వి ఇలా వ్రాశారు, ‘ఇంటి అద్దె, నిర్వహణ, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ఆహారం 40వేలలో చేర్చబడ్డాయని రిప్లై ఇచ్చాడు.