Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Road Accident: అతి వేగం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతుంది. ఇక రాత్రి పూట అయితే మరీ అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిద్ర మత్తులోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇలా రాత్రి వేళల్లో చాలా యాక్సిండెంట్లు జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడులోకి కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Also Read: Gujarat: పిల్లల విషయంలో అలా చేస్తున్నారా.. ఇకపై అది నేరం
Also Read
వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వ్యాన్ లో డ్రైవర్ తో కలిపి 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన వారిలో ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇక ఆ వ్యాన్ ఎనుగూరు నుంచి పెరుంతరై వైపు వెళుతోంది. మృతిచెందినవారిని సెల్వరాజ్, మంజుల, పళనిస్వామి, అరుముగం,పప్పాతిగా గుర్తించారు. ఇక అదే వ్యాన్ లో ఉన్న ప్రియా అనే ప్రయాణీకురాలు, డ్రైవర్ విఘ్నేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటేనే వ్యాన్ ఎంత స్పీడ్ లో ఉందో ఉందో అర్థం అవుతుంది. కేవలం డ్రైవర్ స్పీడ్ గా నడపడం వల్లే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసలు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Six people, including a one-year-old child, lost their lives after a speeding van rammed a stationary lorry on the Salem-Erode highway in Tamil Nadu. The accident was captured on a CCTV camera. pic.twitter.com/2Wg7QlT1ch
— News Bulletin (@newsbulletin05) September 6, 2023
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. కారణమిదేనా?
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
-
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!