WPL 2023: ఆర్సీబీ కెప్టెన్గా మంధానా.. ప్రకటించిన కోహ్లీ, డుప్లెసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమెన్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా కెప్టెన్గా వ్యవహరించనుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్లో ఐదు జట్లు పోటీపడుతుండగా ఇటీవలే ప్లేయర్ వేలం పూర్తయింది. ఈ మెగావేలంలో మంధానాను ఆర్సీబీ రూ 3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్తో మంధాన కెప్టెన్గా నియమితురాలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మేనేజ్మెంట్. స్మృతికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League – Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 18, 2023
ఇక, ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్ అని సంతోషం వ్యక్తం చేసింది. విరాట్, డుప్లెసిస్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.
మంధానా రికార్డు
డబ్ల్యూపీఎల్ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా స్మృతి పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తమ మెంటార్గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది.
Also Read: Akhil Akkineni: ‘ఏజెంట్’ సైలెన్స్ ‘వయోలెన్స్’ని డిఫైన్ చేస్తుంది…
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!