SL vs IND: సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు
- ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అదృష్టం
- అంతకు మించి నాకేం అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matheesha Pathirana Says Sharing the dressing room with MS Dhoni is very special: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు. చెన్నై తరఫున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా అని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టం అని పతిరన పేర్కొన్నాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన.. చెన్నై తరఫున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే సీఎస్కే కీలక బౌలర్గా ఎదిగాడు. దీంతో అతడికి శ్రీలంక టీమ్లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో పతిరన ఫర్వాలేదనిపించాడు.
భారత్తో మూడు టీ20ల సిరీస్ కోసం మతీశా పతిరన సిద్దమవుతున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అండర్-19 తర్వాత ఏ జట్టులో కూడా నాకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడాక జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. చెన్నై తరఫున ఆడటం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తా. సీఎస్కేలో ఆడకముందు వరకు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న తర్వాత.. చెన్నై ఆడిన ప్రతీ మ్యాచ్లో సత్తా చాటేందుకు ప్రయత్నించా. ఆ తర్వాత గుర్తింపు లభించింది. నాలాంటి కుర్రాళ్లకు ధోనీతో పరిచయం చాలా ప్రత్యేకం’ అని పతిరన అన్నాడు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
Also Read: Telangana Budget 2024: త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ.. వరి సన్నాలకు రూ.500 బోనస్: డిప్యూటీ సీఎం
‘నా బౌలింగ్ను చూసి చాలా మంది డెత్ ఓవర్లలో అద్భుతంగా వేస్తున్నావని ప్రశంసించారు. కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలోనూ మెరుగైన బౌలర్గా మారాలి. కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలిగితే.. నాకే కాదు నేను ఆడే జట్టుకూ మంచి జరుగుతుంది. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించట్లేదు. నిలకడగా ఒకేచోట బంతిని వేయడంపై దృష్టి సారిస్తా. సరైన లెంగ్త్తో పాటు స్వింగ్ రాబడితే చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు’ అని మతీశా పతిరన చెప్పాడు.
తాజావార్తలు
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!