SL vs IND: సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు
- ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అదృష్టం
- అంతకు మించి నాకేం అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matheesha Pathirana Says Sharing the dressing room with MS Dhoni is very special: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు. చెన్నై తరఫున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా అని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టం అని పతిరన పేర్కొన్నాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన.. చెన్నై తరఫున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే సీఎస్కే కీలక బౌలర్గా ఎదిగాడు. దీంతో అతడికి శ్రీలంక టీమ్లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో పతిరన ఫర్వాలేదనిపించాడు.
భారత్తో మూడు టీ20ల సిరీస్ కోసం మతీశా పతిరన సిద్దమవుతున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అండర్-19 తర్వాత ఏ జట్టులో కూడా నాకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడాక జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. చెన్నై తరఫున ఆడటం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తా. సీఎస్కేలో ఆడకముందు వరకు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న తర్వాత.. చెన్నై ఆడిన ప్రతీ మ్యాచ్లో సత్తా చాటేందుకు ప్రయత్నించా. ఆ తర్వాత గుర్తింపు లభించింది. నాలాంటి కుర్రాళ్లకు ధోనీతో పరిచయం చాలా ప్రత్యేకం’ అని పతిరన అన్నాడు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Also Read: Telangana Budget 2024: త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ.. వరి సన్నాలకు రూ.500 బోనస్: డిప్యూటీ సీఎం
‘నా బౌలింగ్ను చూసి చాలా మంది డెత్ ఓవర్లలో అద్భుతంగా వేస్తున్నావని ప్రశంసించారు. కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలోనూ మెరుగైన బౌలర్గా మారాలి. కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలిగితే.. నాకే కాదు నేను ఆడే జట్టుకూ మంచి జరుగుతుంది. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించట్లేదు. నిలకడగా ఒకేచోట బంతిని వేయడంపై దృష్టి సారిస్తా. సరైన లెంగ్త్తో పాటు స్వింగ్ రాబడితే చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు’ అని మతీశా పతిరన చెప్పాడు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..