NTV Telugu Site icon

UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి

Up Road Accident

Up Road Accident

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడిపోవడం వల్ల సంఘటన ప్రదేశంలోనే ఆరుగురు మృతి చెందారు. కాగా, కారులో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Read Also: Rohit-Kuldeep: కుల్దీప్ ఏం మాట్లాడుతున్నావ్.. రోహిత్ అసహనం! వీడియో వైరల్

అయితే, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని.. జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. ఇక, ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం పంపించారు. ప్రస్తుతం వారు ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగా, ఆరుగురి మృతదేహాలను పోలీసులు శవ పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారు అదుపు తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతులను గుర్తిస్తామని చెప్పుకొచ్చారు.