Protest : కూతురి శవంతో 30గంటల పాటు ఆమె ప్రియుడి ఇంటి ముందు తల్లి ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని సిద్ధ్గోడా బాగున్హటు రోడ్ నెం-5లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి మృతికి కారకుడైన ప్రేమికుడు వికాస్ దత్తా, అతని తండ్రిని పోలీసులు గురువారం జైలుకు పంపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతురాలి సోదరుడు, స్థానిక నాయకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎఫ్ఐఆర్ కాపీని, అతని తండ్రిని జైలుకు పంపిన రుజువును అందించారు. అనంతరం ప్రేమికుడి ఇంటి వద్ద ధర్నాకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తొలగించి అంత్యక్రియలు నిర్వహించారు.
Read Also: Shilpa Shetty: 47 ఏళ్ళ వయస్సులో కూడా ఆ శరీర సౌష్టవమేలా.. భామా
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
వికాస్ తన కుమార్తెను చంపి మృతదేహాన్ని నదిలో పడేశాడని మృతురాలి తల్లి ఆరోపించింది. పోలీసులు మృతదేహం దగ్గరకు వచ్చి నిందితులపై చర్య తీసుకునేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమని యువతి తల్లి భీష్మించుకుని కూర్చొంది. అసలేం జరిగిందంటే.. బాధితురాలి కుమార్తె చనిపోయే ముందు, ఆమె ప్రేమికుడు వికాస్ దత్తా నది ఒడ్డున ఆమెపై దాడి చేసి మొబైల్ లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో బంధువులకు లభించింది. దీంతో కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టంలో కూడా బాలిక శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. మృతదేహం రోజంతా ఎండలో ఉండడంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ధర్నాలో కూర్చున్న మహిళను, ఆమె కొడుకును కూడా ప్రజలు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ వినలేదు. కుమార్తె మృతదేహాన్ని తెల్లటి గుడ్డలో చుట్టి, తన ప్రేమికుడి ఇంటి ప్రాంగణంలో చిన్న కూతురుతో కలిసి ధర్నాకు కూర్చుంది. మృతదేహం నుంచి దుర్వాసనతోపాటు పురుగులు వచ్చాయి. చనిపోయిన అమ్మాయే ఆ ఇంటికి పెద్ద కూతురు.
Read Also: Parvati Nair : ప్యాంట్ బటన్ విప్పి.. సెగలు పుట్టిస్తోందే
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!