Site icon NTV Telugu

MLA’s Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరొకరికి నోటీసులు

Telangana Highcourt

Telangana Highcourt

మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో మరొకరికి నోటీసులు జారీ చేసింది సిట్‌. జగ్గు స్వామి సోదరుడు మనిలాల్‌కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును మనిలాల్ ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. కేసుపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిందితులతో పాటు బీజేపీ వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.

Also Read : CM YS Jagan: రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

బండి సంజయ్ పేరు చెబితే నిమిషాల్లో విచారణ ముగిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌​పై నమ్మకం లేదని.. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్ తరఫు న్యాయవాది. ఈ కేసులో ప్రతిపాద నిందితులుగా ఉన్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు జారీ చేసిన 41ఏ నోటీసులపై ఉన్న స్టేను 22వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. 41ఏ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేయడంతో వాటిపై స్టే విధించింది హైకోర్టు.

Exit mobile version