Veldi Hariprasad : వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూలు పోగులతో అపురూప “కళ” చిత్రం. సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసిన “జీ 20” ప్రత్యేక చిత్రం. ప్రధాని మోడీ తోపాటు ప్రతినిధుల చిత్రాలు చేతిమగ్గంపై ఆవిష్కరణ. చేతిమగ్గంపై నూలు పోగులతో అద్భుతాలను ఆవిష్కరించే చేనేత కళాకారుడు వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను పురస్కరించుకొని అపురూపమైన కళారూపాన్ని వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసి సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను మరోసారి జాతీయస్థాయిలో నిలబెట్టునున్నారు. సిరిసిల్ల చేనేత కళ కు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చి దేశ ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్న కళాకారుడు వెల్ది హరిప్రసాద్. మన్కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
Also Read : Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..
Also Read
- Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
- Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
ఇటీవలే సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేలా “సిరిసిల్ల సిరిపట్టు” చీరను వెల్ది హరిప్రసాద్ దంపతులు చేతిమగ్గంపై రూపొందించి గవర్నర్ తమిళ్ సై చేత ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో జరగనున్న జి20 సమావేశాల సందర్భంగా వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై భారతదేశ చిత్రపటంతో పాటు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీ చిత్రాన్ని 20 దేశాల ప్రతినిధుల చిత్రాలు వచ్చేలా నూనె పోగులతో అపురూప కళా చిత్రాన్ని ఆవిష్కరించారు.
Also Read : Meera Chopra : అందుకే పవన్ కల్యాణ్ రియల్ హీరో అయ్యారు..
జీ 20 లోగో జరి అంచుతో రూపొందించిన హరి ప్రసాద్ కళ చిత్రం మరోసారి జాతీయస్థాయిలో సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను చాటేలా చేతిమగ్గంపై ఆవిష్కరించారు. జి20 లోగోను గతంలో చేతిమగ్గంపై నేసిన హరిప్రసాద్ ఈసారి ప్రత్యేకంగా మన దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. వారం రోజులపాటు కష్టపడి చేతిమగ్గంపై రెండు మీటర్ల వస్త్రంపై నూలు పోగుల మధ్య ఆవిష్కృతమైన కళా నైపుణ్యాన్ని చూసి అబ్బుర పడాల్సిందే. తగిన ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మరెన్నో కళారూపాలను ఆవిష్కరిస్తానని వెల్ది హరిప్రసాద్ తెలిపారు..
తాజావార్తలు
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
-
Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
-
Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు