Veldi Hariprasad : వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూలు పోగులతో అపురూప “కళ” చిత్రం. సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసిన “జీ 20” ప్రత్యేక చిత్రం. ప్రధాని మోడీ తోపాటు ప్రతినిధుల చిత్రాలు చేతిమగ్గంపై ఆవిష్కరణ. చేతిమగ్గంపై నూలు పోగులతో అద్భుతాలను ఆవిష్కరించే చేనేత కళాకారుడు వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను పురస్కరించుకొని అపురూపమైన కళారూపాన్ని వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసి సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను మరోసారి జాతీయస్థాయిలో నిలబెట్టునున్నారు. సిరిసిల్ల చేనేత కళ కు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చి దేశ ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్న కళాకారుడు వెల్ది హరిప్రసాద్. మన్కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
Also Read : Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ఇటీవలే సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేలా “సిరిసిల్ల సిరిపట్టు” చీరను వెల్ది హరిప్రసాద్ దంపతులు చేతిమగ్గంపై రూపొందించి గవర్నర్ తమిళ్ సై చేత ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో జరగనున్న జి20 సమావేశాల సందర్భంగా వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై భారతదేశ చిత్రపటంతో పాటు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీ చిత్రాన్ని 20 దేశాల ప్రతినిధుల చిత్రాలు వచ్చేలా నూనె పోగులతో అపురూప కళా చిత్రాన్ని ఆవిష్కరించారు.
Also Read : Meera Chopra : అందుకే పవన్ కల్యాణ్ రియల్ హీరో అయ్యారు..
జీ 20 లోగో జరి అంచుతో రూపొందించిన హరి ప్రసాద్ కళ చిత్రం మరోసారి జాతీయస్థాయిలో సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను చాటేలా చేతిమగ్గంపై ఆవిష్కరించారు. జి20 లోగోను గతంలో చేతిమగ్గంపై నేసిన హరిప్రసాద్ ఈసారి ప్రత్యేకంగా మన దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. వారం రోజులపాటు కష్టపడి చేతిమగ్గంపై రెండు మీటర్ల వస్త్రంపై నూలు పోగుల మధ్య ఆవిష్కృతమైన కళా నైపుణ్యాన్ని చూసి అబ్బుర పడాల్సిందే. తగిన ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మరెన్నో కళారూపాలను ఆవిష్కరిస్తానని వెల్ది హరిప్రసాద్ తెలిపారు..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!