Miss World 2024: మిస్ వరల్డ్ పోటీలు.. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యూటీ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sini Shetty Comments On Representing India in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. 1996లో బెంగళూరులో చివరిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం.. మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఢిల్లీ, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 71వ మిస్ వరల్డ్ ఎడిషన్లో 130కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో భారత్ నుంచి కన్నడ అమ్మాయి సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మిస్ వరల్డ్ 2024 పోటీల కోసం సినీ శెట్టి ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ‘నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు’ అని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం. ప్రపంచ వేదికపై మన జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. నా ప్రతి గుండె చప్పుడు భారతదేశం కోసం కొట్టుకుంటుంది. ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నా. నేను త్రివర్ణ పతాకాన్ని నా చేతుల్లోనే కాదు, నా హృదయంలో పెట్టుకున్నా. ఈ క్షణం నుండి నేను కేవలం సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను ఇండియన్. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట నన్ను పెంచిన భూమి కోసమే’ అని సినీ శెట్టి పేర్కొన్నారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Also Read: Mobile Phones Ban: ప్రధాని కీలక నిర్ణయం.. తరగతి గదుల్లోకి మొబైల్స్ ఫోన్స్ నిషేధం!
ముంబైలో జన్మించిన 21 ఏళ్ల సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్లో గ్రాడ్యుయేట్ చేసిన సినీ శెట్టి.. భరతనాట్యంలో శిక్షణ పొందారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టిన ఆమెకు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 1966లో భారత్ తరఫున రీటా ఫారియా తొలిసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!