Singapore: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సర్కార్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసాహార ప్రియులకు ఇదొక బ్యాడ్ న్యూస్. మీరు బాగా నాన్వెజ్ తింటుంటారా? అయితే మీరు ఎలాంటి మసాలాలు ఉపయోగిస్తుంటారు. ఇంట్లోనే తయారు చేసుకుంటారా? లేదంటే బయట మసాలాలు ఉపయోగిస్తారా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Boora Narsaiah Goud: ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే భయం కాంగ్రెస్ వాళ్లకు పట్టుకుంది..
Also Read
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
నాన్వెజ్ వంటకం చేస్తున్నారంటేనే మసాలాలు దండిగా దట్టిస్తుంటారు. సువాసనలతో గుమగుమలాడాలనుకుంటారు. ఒకప్పుడు ఇంట్లోనే మసాలాలు తయారు చేసుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెడీమెడ్గా దొరికే మసాలాలనే ఉపయోగిస్తున్నారు. బజారులో దొరికే మసాలాలనే ఉపయోగిస్తుంటారు. అయితే ఇండియాలో తయారు అవుతున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Anna Rambabu: వైసీపీ క్యాడరే నాకు బలం.. బలగం..
ఎవరెస్ట్ యొక్క ఫిష్ కర్రీ మసాలాలో అధిక మోతాదులో పురుగుల మందు అవశేసాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మసాలాలను తిరిగి పంపించేయాలని ఆదేశించింది. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఈ మేరకు రీకాల్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రకటనలో పేర్కొంది. మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఏజెన్సీ గుర్తించిందని వెల్లడించింది. ఆహారంలో పురుగుల మందు వాడేందుకు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను సూక్ష్మజీవులను నిరోధించడానికి రసాయనాలు ఉపయోగించవచ్చని తెలిపింది. ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని స్పష్టం చేసింది. తక్కువ స్థాయిలో తీసుకుంటే మాత్రం తక్షణమే ప్రమాదం ఉండదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వివరించింది.
ఇది కూడా చదవండి: Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!