Singapore: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సర్కార్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసాహార ప్రియులకు ఇదొక బ్యాడ్ న్యూస్. మీరు బాగా నాన్వెజ్ తింటుంటారా? అయితే మీరు ఎలాంటి మసాలాలు ఉపయోగిస్తుంటారు. ఇంట్లోనే తయారు చేసుకుంటారా? లేదంటే బయట మసాలాలు ఉపయోగిస్తారా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Boora Narsaiah Goud: ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే భయం కాంగ్రెస్ వాళ్లకు పట్టుకుంది..
Also Read
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
నాన్వెజ్ వంటకం చేస్తున్నారంటేనే మసాలాలు దండిగా దట్టిస్తుంటారు. సువాసనలతో గుమగుమలాడాలనుకుంటారు. ఒకప్పుడు ఇంట్లోనే మసాలాలు తయారు చేసుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెడీమెడ్గా దొరికే మసాలాలనే ఉపయోగిస్తున్నారు. బజారులో దొరికే మసాలాలనే ఉపయోగిస్తుంటారు. అయితే ఇండియాలో తయారు అవుతున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Anna Rambabu: వైసీపీ క్యాడరే నాకు బలం.. బలగం..
ఎవరెస్ట్ యొక్క ఫిష్ కర్రీ మసాలాలో అధిక మోతాదులో పురుగుల మందు అవశేసాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మసాలాలను తిరిగి పంపించేయాలని ఆదేశించింది. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఈ మేరకు రీకాల్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రకటనలో పేర్కొంది. మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఏజెన్సీ గుర్తించిందని వెల్లడించింది. ఆహారంలో పురుగుల మందు వాడేందుకు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను సూక్ష్మజీవులను నిరోధించడానికి రసాయనాలు ఉపయోగించవచ్చని తెలిపింది. ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని స్పష్టం చేసింది. తక్కువ స్థాయిలో తీసుకుంటే మాత్రం తక్షణమే ప్రమాదం ఉండదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వివరించింది.
ఇది కూడా చదవండి: Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!