టాలీవుడ్లో తనదైన మేనరిజం మరియు టైమింగ్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే, డీజే టిల్లు వంటి సూపర్ హిట్స్ తర్వాత జాక్, తెలుసు కదా వంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు సిద్దు. దాంతో ఇప్పుడు రూటు మార్చి ఒక విభిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read : UstaadBhagatSingh : ధురంధర్ – 2కు జై.. ఉస్తాద్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. ఫ్యాన్స్ ఫైర్
ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’కు ఆయన కో-రైటర్గా మరియు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఇప్పడు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన చిత్రమని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యత ఉన్న ఫాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథా నేపథ్యం మరియు మేకింగ్ పరంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సిద్ధు జొన్నలగడ్డ మార్క్ ఎనర్జీకి ఫాంటసీ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుస ఫ్లోప్స్ తో ఇబ్బందిపడుతున్న సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.