Karnataka: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు
- రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు
- దీనికి సంబంధించిన రెండు సవరణ బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025 ఆమోదించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెరుగుతున్న ఖర్చులు, శాసనసభ్యులు మనుగడ సాగించాల్సిన అవసరం కారణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read:Pakistan: భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. మరోసారి పాక్ ఆరోపణలు..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 1,50,000, మంత్రి జీతం నెలకు రూ. 1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగవచ్చు. పెన్షన్లలో కూడా భారీ పెరుగుదల ఉండే ఛాన్స్ ఉంది. నెలకు రూ. 55,000 నుంచి రూ. 95,000 వరకు పెరగొచ్చు. ప్రయాణ భత్యాలు.. విమాన, రైలు టిక్కెట్లకు గతంలో నెలకు రూ. 2,50,000 నుంచి నెలకు రూ. 3,50,000 పెరగొచ్చు. వైద్య భత్యాలు, టెలిఫోన్ ఛార్జీలు, పోస్టల్ ఛార్జీలు నెలకు రూ.85,000 నుంచి రూ.1,10,000 కు పెరగొచ్చు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ జీతాలను 67 శాతం పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది.
Also Read:AP Govt: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..
ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలను పెంచడంలో తప్పు లేదని చెబుతూ మంత్రి ఎంబీ పాటిల్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు కూడా ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వారిలో ఉన్నారని, ఇది వారిని మరింత స్వతంత్రంగా, తక్కువ అవినీతిపరులుగా మారుస్తుందని ఎంబి పాటిల్ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా జీతాల పెంపుపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!