కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025 ఆమోదించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెరుగుతున్న ఖర్చులు, శాసనసభ్యులు మనుగడ సాగించాల్సిన అవసరం కారణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read:Pakistan: భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. మరోసారి పాక్ ఆరోపణలు..
ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 1,50,000, మంత్రి జీతం నెలకు రూ. 1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగవచ్చు. పెన్షన్లలో కూడా భారీ పెరుగుదల ఉండే ఛాన్స్ ఉంది. నెలకు రూ. 55,000 నుంచి రూ. 95,000 వరకు పెరగొచ్చు. ప్రయాణ భత్యాలు.. విమాన, రైలు టిక్కెట్లకు గతంలో నెలకు రూ. 2,50,000 నుంచి నెలకు రూ. 3,50,000 పెరగొచ్చు. వైద్య భత్యాలు, టెలిఫోన్ ఛార్జీలు, పోస్టల్ ఛార్జీలు నెలకు రూ.85,000 నుంచి రూ.1,10,000 కు పెరగొచ్చు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ జీతాలను 67 శాతం పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది.
Also Read:AP Govt: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..
ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలను పెంచడంలో తప్పు లేదని చెబుతూ మంత్రి ఎంబీ పాటిల్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు కూడా ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వారిలో ఉన్నారని, ఇది వారిని మరింత స్వతంత్రంగా, తక్కువ అవినీతిపరులుగా మారుస్తుందని ఎంబి పాటిల్ తెలిపారు. అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా జీతాల పెంపుపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.