SI Madhu: నన్ను చంపాలని చూశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Madhu: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు వరుసగా ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్ ఘటన మరువక ముందే.. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనిఖీలు చేస్తున్న ఎస్సై మధును ఒక కారు ఢీకొట్టి, ఆపై బానెట్పై ఉంచుకుని దాదాపు అర కిలోమీటరు దూరం వేగంగా దూసుకెళ్లింది.
Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్
Also Read
- Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
- Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
ఈ భయానక అనుభవంపై ఎస్ఐ మధు ‘ఎన్ టీవీ’తో మాట్లాడుతూ.. కారు డ్రైవర్ ఉన్మాదాన్ని వివరించారు. నేను డ్రంకెన్ డ్రైవ్లో ఉన్న వారికి చలాన్లు రాస్తుండగా, ఒక కారు కానిస్టేబుల్ను తప్పించుకుని నేరుగా నా మీదకు దూసుకువచ్చిందన్నారు. దానిని తప్పించుకునే లోపే నేను కారు బానెట్పై పడిపోయాను. నన్ను చంపేసైనా సరే పారిపోవాలన్న ఉద్దేశంతో కారును ఆపకుండా 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోనిచ్చారని ఆయన తెలిపారు.
Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!
కిందకు దూకుదామంటే ఎడమవైపు కారు టైర్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది. కుడివైపు డివైడర్లు ఉన్నాయి. అందుకే బానెట్ను గట్టిగా పట్టుకుని ఆపమని కేకలు వేశానని ఆయన వివరించారు. అలాగే తాను బానెట్పై ఉండగానే ఆ కారు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో టూవీలర్పై ఉన్న మహిళ కాలు విరిగింది (ఫ్రాక్చర్) అని అన్నారు. సుమారు 500 మీటర్ల తర్వాత ఒక మలుపు వద్ద కారు వేగం తగ్గించడంతో చాకచక్యంగా పక్కకు దూకేశానని తెలిపారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!