Shubman Gill: పోంజీ కుంభకోణం.. క్రికెటర్ శుభ్మన్ గిల్కు సమన్లు!
- పోంజీ కుంభకోణం బాధితుల్లో స్టార్ క్రికెటర్
- శుభ్మన్ గిల్కు సమన్లు
- భారత్కు వచ్చాక సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోంజీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని జనాలను మోసం చేసి.. ఏకంగా రూ.6 వేల కోట్లను బీజెడ్ గ్రూప్ పోగేసింది. ఈ స్కామ్లో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే పోంజీ స్కామ్లో గుజరాత్ సీఐడీ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లలో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. త్వరలోనే గిల్కు సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోంజీ కుంభకోణం బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ క్రికెటర్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాతియాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది. ఈ ముగ్గురు గిల్ మాదిరి పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారట. బీజెడ్ గ్రూప్నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఈ నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందట. ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతడు భారత్కు వచ్చాక సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లోని పలు ప్రాంత ప్రజలను బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ నమ్మించారు. ఏజెంట్ల ద్వారా కోట్లు వెనకేశారు. మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులకు బీజెడ్ సంస్థపై అనుమానం రావడంతో.. సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోంజీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందికి పైగా ఏజెంట్లను సీఐడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!