Shubman Gill: పోంజీ కుంభకోణం.. క్రికెటర్ శుభ్మన్ గిల్కు సమన్లు!
- పోంజీ కుంభకోణం బాధితుల్లో స్టార్ క్రికెటర్
- శుభ్మన్ గిల్కు సమన్లు
- భారత్కు వచ్చాక సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోంజీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని జనాలను మోసం చేసి.. ఏకంగా రూ.6 వేల కోట్లను బీజెడ్ గ్రూప్ పోగేసింది. ఈ స్కామ్లో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే పోంజీ స్కామ్లో గుజరాత్ సీఐడీ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లలో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. త్వరలోనే గిల్కు సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోంజీ కుంభకోణం బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ క్రికెటర్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాతియాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది. ఈ ముగ్గురు గిల్ మాదిరి పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారట. బీజెడ్ గ్రూప్నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఈ నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందట. ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతడు భారత్కు వచ్చాక సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లోని పలు ప్రాంత ప్రజలను బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ నమ్మించారు. ఏజెంట్ల ద్వారా కోట్లు వెనకేశారు. మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులకు బీజెడ్ సంస్థపై అనుమానం రావడంతో.. సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోంజీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందికి పైగా ఏజెంట్లను సీఐడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!