Shubman Gill: పోంజీ కుంభకోణం.. క్రికెటర్ శుభ్మన్ గిల్కు సమన్లు!
- పోంజీ కుంభకోణం బాధితుల్లో స్టార్ క్రికెటర్
- శుభ్మన్ గిల్కు సమన్లు
- భారత్కు వచ్చాక సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోంజీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని జనాలను మోసం చేసి.. ఏకంగా రూ.6 వేల కోట్లను బీజెడ్ గ్రూప్ పోగేసింది. ఈ స్కామ్లో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే పోంజీ స్కామ్లో గుజరాత్ సీఐడీ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లలో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. త్వరలోనే గిల్కు సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోంజీ కుంభకోణం బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ క్రికెటర్స్ సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాతియాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది. ఈ ముగ్గురు గిల్ మాదిరి పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారట. బీజెడ్ గ్రూప్నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఈ నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందట. ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతడు భారత్కు వచ్చాక సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లోని పలు ప్రాంత ప్రజలను బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ నమ్మించారు. ఏజెంట్ల ద్వారా కోట్లు వెనకేశారు. మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులకు బీజెడ్ సంస్థపై అనుమానం రావడంతో.. సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోంజీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందికి పైగా ఏజెంట్లను సీఐడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..